English | Telugu

`నెం.1 కోడలు` లోకి సీనియ‌ర్ న‌టి క‌విత ఎంట్రీ

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `నె.1 కోడ‌లు`. గ‌త కొంత కాలంగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. `మ‌యూరి` ఫేమ్ సుధా చంద్ర‌న్‌, సీనియ‌ర్ న‌టి క‌విత‌, జై ధనుష్, మ‌ధుమ‌త, క్రాంతి చంద్‌, సాక్షి శివ‌, బాలాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ గురువారం కొత్త మలుపు తిరిగ‌బోతోంది. ఈ సీరియ‌ల్ లోకి కొత్త‌గా సీనియ‌ర్ న‌టి క‌విత ఎంట్రీ ఇస్తోంది.

వాగ్ధేవి ముఖ్య‌మైన ప‌ని మీద టూర్ వెళ్ల‌డానికి రెడీ అవుతూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో అత్త పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి క‌విత త‌న మ‌న‌వ‌రాలితో ఎంట్రీ ఇస్తుంది. మ‌ధ్య‌లో కార్ ఆగిపోవ‌డంతో రాహుల్ కి ఫోన్ చేసి పిక‌ప్ చేసుకోమని ద‌బాయిస్తుంది. ఆమె మాట‌ల‌కు హ‌డ‌లెత్తిపోయిన రాహుల్ వెళ్లి త‌న‌ని ఇంటికి తీసుకొస్తాడు. క‌విత‌ని చూసిన వాగ్ధేవి త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకుని హ‌డ‌లి పోతుంది. త‌ను ఇప్పుడు ఎందుకొచ్చిందంటూ లోలోన భ‌య‌ప‌డుతూ వుంటుంది.

ఇదే స‌మ‌యంలో భోజ‌నం చేద్దామ‌ని అంతా క‌విత‌ని డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌రికి తీసుకొస్తారు. అక్క‌డ వున్న వంట‌కాల‌ని చూసిన క‌విత ఏంటే ఇదంతా అంటూ వాగ్ధేవిని నిల‌దీస్తుంది. ఉడికీ ఉడ‌క‌ని కూర‌లు.. కాలీ కాల‌ని రొట్టెముక్క‌లు..ఇలాంటి తిండి తింటే నూరేళ్లు బ్ర‌త‌క‌డం కాదు యాభై ఏళ్ల‌లోనే అర్థ్రాయుష్సు అయిపోతుంది అంటుంది. ఈ వంటలు న‌చ్చ‌క‌పోవ‌డంతో `ఒక‌సారి నీ చేతి వంట రుచి చూడాల‌ని వుంది` అంటుంది. దాంతో కంగారు ప‌డ్డ వాగ్ధేవి నేనా అని ఆశ్చ‌ర్యంతో చూస్తుంది. అవును అంటూ క‌విత `మిర్చీలు గిర్చీలు వాడ‌కుండా..అన్నీ చేత్తో రుబ్బి.. కుదిరితే పాయ‌సం కూడా చేయి అని వాగ్ధేవికి ఆర్ధ‌ర్ వేస్తుంది క‌విత‌.. ఆ లిస్ట్ అంతా విని షాక్ అయిన వాగ్ధేవి త‌ను చెప్పిన‌ట్టే వంట ప్రిపేర్ చేసిందా? ... ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. క‌విత .. వాగ్ధేవిని ఎలా ఆడుకుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.