English | Telugu

పెళ్లిపీట‌లెక్కిన యాంక‌ర్ ర‌ష్మీ.. వ‌రుడు..?

బుల్లితెర బ్యూటీ యాంక‌ర్ ర‌ష్మీ జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గ‌తంలో సుడిగాలి సుధీర్ తో క‌లిసి ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తూ పాపుల‌ర్ అయిన ర‌ష్మీ గౌత‌మ్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట కెమిస్ట్రీని చూసిప జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ వీరికి రెండు మూడు సార్లు స్టేజ్ పై ఉత్తుత్తి పెళ్లి చేసి మురిసిపోయింది. ఇది నిజ‌మేనా అనే రేంజ్ లో అంద‌రికి షాకిచ్చింది కూడా. అయితే గ‌త కొన్ని వారాలుగా సుడిగాలి సుధీర్ జబ‌ర్ద‌స్త్ ని వీడి సినిమాల‌తో పాటు ఇత‌ర టీవీ షోల్లో బిజీ అయిపోయాడు. దీంతో ఈ షోకి దూర‌మ‌య్యాడు. సుధీర్ లేక పోవ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ షో చ‌ప్ప‌గా సాగుతోంది.

ఇదిలా వుంటే ర‌ష్మీగౌత‌మ్ పెళ్లిపీట‌లెక్కింది. వరుడి ప‌క్క‌న కూర్చుని మురిసిపోయింది. ఇంత‌కీ ర‌ష్మీ ప‌క్క‌న కూర్చుకున్న పెళ్లి కొడుకు ఎవ‌రన్న‌ది స‌స్పెన్స్ లో పెట్టేసింది. అస‌లు ర‌ష్మీ ప‌క్క‌న కూర్చున్న పెళ్లి కొడుకు సుడిగాలి సుధీరేనా లేక మ‌రొక‌ర అన్న‌ది స‌స్పెన్స్ గా మాంది. ఇంత‌కీ ర‌ష్మీ పెళ్లి పీట‌లెక్క‌డం ఏంటీ? .. ప‌క్క‌న పెళ్లి కొడుకు ముఖం క‌నిపించకుండా కూర్చోవ‌డం ఏంటీ? .. వివ‌రాల్లోకి వెళితే.. జ‌బ‌ర్ద‌స్త్ షో లో యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ష్మీ అప్పుడ‌ప్పుడు టీమ్ లీడ‌ర్ల‌తో క‌లిసి స్కిట్ ల‌లో పాల్గొంటోంది. తాజాగా అలాంటి ఓ స్కిట్ లో ఏకంగా పెళ్లి కూతురుగా ముస్తాబై పెళ్లి పీట‌లెక్కి షాకిచ్చింది.

అయితే త‌న ప‌క్క‌న కూర్చున్న వ‌రుడు ఎవ‌ర‌న్న‌ది చూపించ‌కుండా సస్పెన్స్ లో పెట్టారు. ర‌ష్మీ ప‌క్క‌న పెళ్లి పీట‌లపై కూర్చున్న వ్య‌క్తి ముఖం క‌నిపించ‌కుండా మ‌ల్లెపూల మాల‌తో క‌వ‌ర్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టంట సంద‌డి చేస్తోంది. ఈ షో తాజా ఎపిసోడ్ కు గెస్ట్ గా డా. రాజ‌శేఖ‌ర్ హాజ‌రు కాగా శ్ర‌ద్దా దాస్ జ‌డ్జిగా ఎంట్రీ ఇచ్చింది. ఎప్ప‌టి లాగే ఇంద్ర‌జ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. తాజా ఎపిసోడ్ త్వ‌ర‌లోనే టెలికాస్ట్ కాబోతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.