English | Telugu

చంద్రబోస్‌తో హైపర్ ఆది గొడవ... ఎక్కి ఎక్కి ఏడ్చిన రష్మీ


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో హోస్ట్ రష్మీ ఎప్పుడూ లేనంతగా ఏడ్చేసింది. చంద్రబోస్ ఒక పాట పాడి ఆమెను ఏడిపించారు. ఈ షోకి "బాడ్ గర్ల్స్" మూవీ టీమ్ నుంచి గీత రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ వచ్చారు. ప్రోమో స్టార్టింగ్ నుంచి ఫుల్ జోష్ తో సాగింది. రష్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది కానీ ప్రోమో లాస్ట్ లో ఐతే రష్మీ అదే పనిగా ఏడుస్తూనే ఉంది. జీవితంలో ఒక్క మనిషైనా మన కోసం ఉంటె ఆ ఆనందమే వేరు. అది అమ్మాయైనా , అబ్బాయైనా...ఇక్కడ రష్మీ బాధ కూడా అదే. ప్రోమో చివరిలో అనూప్ రూపెన్స్ గిటార్ ప్లే చేస్తుంటే చంద్రబోస్ ఒక సాంగ్ పాడారు. "ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే..కన్నీళ్లను అడుగుతానే నవ్వుల్లోనే రావాలని...దూరాన్నీ అడుగుతానే ఏడడుగులతో ఆగాలని...మరణాన్నే అడుగుతానే ఇద్దరికీ ఒకేసారి రావాలని" అంటూ ఒక హార్ట్ టచ్చింగ్ సాంగ్ ని పాడారు. ఆ పాట పట్టినంత సేపు రష్మీ ఏడుస్తూనే ఉంది. "నిజంగా మీ పాట విన్న తర్వాత మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక అబ్బాయి దొరికితే మాత్రం అదృష్టమే అనుకోవాలి." అంటూ చెప్పి మళ్ళీ ఏడ్చింది. దాంతో చంద్రబోస్ కూడా పాపం చాలా ఫీలయ్యారు రష్మీ మాటలకు. ఇక ఆ పాట పాడే టైములో ఆది వెళ్లి చంద్రబోస్ కాళ్ళు మొక్కాడు. బుల్లితెర మీద రష్మీ - సుధీర్ జోడి చేసిన మ్యాజిక్ గురించి అందరికీ తెలుసు. చాలా షోస్ లో వీళ్లకు పెళ్లి కూడా చేసేసారు. రియల్ లైఫ్ లో కూడా ఇద్దరికీ పెళ్ళైపోతుంది అని అంతా ఎదురు చూసారు. కానీ ఇద్దరూ వేరైపోయారు. సుధీర్ ఛానెల్ చేంజ్ ఐపోయాడు అలాగే మూవీస్ లో నటిస్తున్నాడు. ఏ షోలో సుధీర్ టాపిక్ వచ్చిన రష్మీ రియాక్షన్ కొంచెం డల్ గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు చంద్రబోస్ సాంగ్ కి కూడా రష్మీ ఏడ్చేసింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.