English | Telugu

రుద్రాణి చెంత‌కు చేరిన మోనిత బిడ్డ‌

బుల్లితెర‌పై మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ టాప్ లో కొన‌సాగుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`.ఈ బుధ‌వారం 1229 వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఎపిసోడ్ లోప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. త‌న బిడ్డ ఎక్క‌డున్నాడో అని ఆలోచిస్తూ వుంటుంది మోనిత‌.. అంతే కాకుండా మీ అమ్మ నిన్ను ఖ‌చ్చితంగా కనిపెడుతుంద‌ని ఎందుకంటే మీ అమ్మ పేరు మోనితా కార్తీక్ కాబ‌ట్ట‌ని .. మోనిత త‌న‌లో తానే మైండ్వాయిస్ వేసుకుంటుంది.

Also read:స‌న్నీని బిగ్ బాస్ 5 విజేత‌గా చేసింది.. ఈ మాటే!

ఇంత‌లో శ్రావ్య రావ‌డాన్ని గ‌మ‌నించి నేను కాఫీ క‌లిపివ్వ‌నా అంటుంది మోనిత‌.. నువ్వు కాఫీనే కాదు వ‌రుస‌లు కూడా బాగా క‌లుపుతావ్‌.. అవ‌స‌ప‌రం లేని వ‌రుస‌ల‌న్నీ ఈ ఇంటి ని వ‌దిలేపి వెళితే.. మేం చాలా ప‌సంతోషిస్తాం అంటాడు ఆదిత్య‌. వెంట‌నే నువ్వే బాబుని దాచావంటూ ఎదురుదాడికి దిగుతుంది మోనిత‌.. నాకేం అవ‌స‌రం నేనెందుకు దాస్తానంటూ ఫైర్ అవుతాడు ఆదిత్య‌... క‌ట్ చేస్తే శ్రీ‌వ‌ల్లి ఇంట్లో మోనిత కొడుకు ఆనంద‌రావు గుక్క‌ప‌ట్టి ఏడుస్తుంటాడు.. శ్రీ‌వ‌ల్లి, దీప పిల్ల‌లు పిల్లాడి ఏడుపు మాన్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు.

Also read:పెళ్లి ఒక‌రితో, ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో.. తమన్ సంచలన వ్యాఖ్యలు!

పిల్లాడి ఏడుపు విన్న కార్తీక్ నిద్ర‌కొచ్చాడేమో అని అక్క‌డికి వ‌చ్చి ఎత్తుకుంటాడు. వెంట‌నే పిల్లాడు ఏడుపు ఆపేస్తాడు. ఇది పిల్ల‌ల‌కు ఏమీ అర్థం కాదు. క‌ట్ చేస్తే శ్రీ‌వ‌ల్లి భ‌ర్త‌తో క‌లిసి బ‌య‌టికి వెళుతుంది. ఎదురుగా వ‌స్తున్న రుద్రాణి శ్రీ‌వ‌ల్లి, కోటేశ్వ‌ర‌రావు చేతుల్లో వున్న బిడ్డ‌ని చూసి త‌న‌కు చూపించ‌మంటుంది. ఆ త‌రువాత కోటేశ్వ‌ర్ రావు, శ్రీ‌వ‌ల్లి దంప‌లకు దీప‌ని, కార్తీక్‌ ని చూసుకుని ఎగిరెగిరిప‌డ‌కంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మోనిత .. సౌంద‌ర్య తో ఏమంది?.. ఆమెకు కోపం ఎందుకు తెప్పించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.