English | Telugu

Bigg Boss : ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని రివీల్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-8 మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్‌తో మొదలైంది. మొదటివారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడోవారం అభయ్ నవీన్, నాలుగోవారం సోనియా ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగు వారాలు ముగిసేసరికి పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు.

ఇక ఈ వారం మరో ఇద్దరు బయటకు వస్తున్నారు. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండటంతో పాటు వీకెండ్ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే వచ్చేవారం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొత్త కంటెస్టెంట్స్‌లు హౌస్‌లోకి రాబోతున్నారు. వారిలో కొంతమంది పేర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. వారిలో యాంకర్ రవి, గంగవ్వ, దిల్ సే మెహబూబ్, నయని పావని, తీన్మార్ సావిత్రి, టేస్టీ తేజ, రోహిణి, ముక్కు అవినాష్ హౌస్ లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి‌. వీరిలో టేస్టీ తేజ ఇప్పటికే కన్ఫమ్ అయినట్టు తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి.. పాత కంటెస్టెంట్స్‌నే వైల్డ్ కార్డ్‌ల ద్వారా హౌస్‌లోకి పంపిస్తున్నారనేది అందరికి తెలిసిందే.

సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ టేస్టీ తేజా పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు బిబి టీమ్. ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు అఫీషియల్ పేజీలలో కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటు పోస్ట్ వేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తేజా ఫేస్ రివీల్ చేయకుండా.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ ఎవరో కనిపెట్టండి అంటూ అతని నీడను మాత్రమే రివీల్ చేశారు. ఇక ఆ బాడీ సైజు చూసి , ఆ కటౌట్ చూస్తే అతనే టేస్టీ తేజ అని ఎవరికైనా అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.