English | Telugu

Karthika Deepam2 : శౌర్య ఆపరేషన్ కోసం అయిదు లక్షలు కావాలన్న డాక్టర్.. కార్తీక్ కి సాయం చేసేదెవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -257 లో.... దశరథ్ ఇంటికి వస్తాడు. ఎవరో నా గదికి గడియ పెట్టారని సుమిత్ర అనగానే.. ఇది జ్యోత్స్న పని అయి ఉంటుందని దశరథ్ అనుకుంటాడు. దశరథ్ జరిగిన విషయంతో ఇంకా షాక్ లోనే ఉండి ఏదో ఏదో మాట్లాడుతుంటే.. నేను చేసిన పనిని డాడ్ చూసాడా ఏంటని జ్యోత్స్న కంగారుపడుతుంది. దశరథ్ షర్ట్ కి రక్తం ఉంటుంది. అది చూసి ఏమైందని సుమిత్ర కంగారుపడుతుంటే దారిలో ఒకరికి హెల్ప్ చేసానని దశరథ్ చెప్తాడు.

ఆ హెల్ప్ చేసింది దాస్ కి అయితే కాదు కదా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శౌర్యని తీసుకొని వెళ్ళడానికి దీపని ఎలా ఒప్పించాలని కార్తీక్ కంగారుపడతాడు. నా ఫ్రెండ్ అర్జెంట్ గా బెంగళూరు వెళ్లాడు తనకి ఓ పాప ఇంకా అమ్మ ఉంది.. వాళ్ళ పాప దగ్గర శౌర్యని వారం రోజులు ఉంచమన్నాడు.. నేను ఉంచుతానని మాటిచ్చానని కార్తీక్ అంటాడు. మొదట దీప వద్దని అంటుంది కానీ ఆ తర్వాత కార్తీక్ దీపని ఓప్పిస్తాడు. మరుసటిరోజు ఉదయం డాక్టర్ తో కార్తీక్ మాట్లాడతాడు. అయిదు లక్షలు అడ్వాన్స్ కట్టాలని డాక్టర్ చెప్పగా.. సరేనని కార్తీక్ అంటాడు. అయిదు లక్షలు ఎలా ఏర్పాటు చెయ్యాలని కార్తీక్ అనుకుంటుండగా.. అప్పుడే దీప వచ్చి.. ఎందుకు అంత డబ్బు అని అడుగుతుంది. రెస్టారెంట్ కి అని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. కానీ దీపకి మాత్రం డౌట్ వస్తుంది.

కాసేపటికి కార్తీక్ తన ఫ్రెండ్ ని డబ్బు అడుగుతాడు. నువ్వు ఇగోకి వెళ్లి ఈ పరిస్థితికి వచ్చావ్.. మీ తాతయ్యకి సారీ చెప్పమని అతను అంటుంటే.. కార్తీక్ తనపై కోప్పడతాడు. దాంతో అతను వెళ్లిపోతాడు‌. అదంతా కాశీ చూసి.. ఎందుకు బావ నీకు అంత డబ్బు అని అడుగుతాడు. దాంతో శౌర్య గురించి కాశీకి చెప్తాడు కార్తీక్. ఈ విషయం అక్కకి తెలియదా అని కాశీ అడుగగా.. తెలియదని కార్తీక్ చెప్తాడు. మరి నన్నెందుకు అడగలేదని కాశీ అనగానే.. పరిస్థితి చూసి ఎలా అడుగుతానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.