English | Telugu

Karthika Deepam2 : మీ పెళ్ళి చేసే వెళ్తాను.. కార్తీక్ ఆ విషయం చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -128 లో.... దీప దగ్గరకి జ్యోత్స్న వచ్చి తను బాధపడేలా మాట్లాడుతుంటుంది. ముందు ఇక్కడనుండి వెళ్ళిపోమంటూ సుమిత్ర కోప్పడుతుంది. చూడు జ్యోత్స్న నా వల్ల మీ పెళ్లి ఆగిపోతుందని భయపడుతున్నావేమో కానీ అలా జరగదు.. మీ పెళ్లి చూడడానికి వచ్చాను.. చూశాకే వెళ్తాను. నీ పెళ్లి చెయ్యడం మీ అమ్మ నాన్న బాధ్యతే కాదు నాది కూడా అని జ్యోత్స్నకి దీప చెప్పి వెళ్లిపోతుంది.

అ తర్వాత సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఏం చేసిన నన్ను అంటున్నారే మనవరాలా అని పారిజాతం జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. మరొకవైపు స్వప్న లవర్ తో కలిసి బయటకు వస్తుంది. ఇంట్లో మన మ్యాటర్ చెప్పావా అని అతను స్వప్నని అడుగుతాడు. లేదు రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నావ్ కదా జాబ్ వచ్చాక చెప్తాను.. మా అన్నయ్య ఉన్నాడు తానే ఒప్పిస్తాడని స్వప్న అనగానే.. ఏంటి నీకు అన్నయ్య కూడ ఉన్నాడా అని అతను అడుగుతాడు. అంటే సొంత అన్నయ్య కాదు నేను అలా అన్నయ్య అనుకుంటున్నా బాస్ అని కూడ పిలుస్తాను.. పేరు కార్తీక్.. నీకు జాబ్ వచ్చాక అమ్మ, నాన్నలకి అతన్ని పిలిచి విషయం చెప్తానని స్వప్న అంటుంది.అ తర్వాత కార్తీక్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని కాంచన అడుగుతుంది. శౌర్యని ఈ రోజు చెకప్ కి తీసుకొని వెళ్ళాలి అని కార్తీక్ అనగానే శ్రీధర్ కోప్పడతాడు. వాళ్ళ అమ్మ ఉంది కదా తను తీసుకొని వెళ్తుందని అంటాడు. ఈ ఒక్క సారి నేను తీసుకొని వెళ్తానని కార్తీక్ అంటాడు. అయిన శ్రీధర్ అర్థం చేసుకోకుండా కాంచనకి ఆలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడంటూ కోప్పడతాడు.

మరొకవైపు మనమే ఎప్పుడు ఆ దీప గురించి ఓవర్ గా ఆలోచిస్తున్నావేమోనని తను నా పెళ్లి చేసాక వెళ్తాను అంటుంది.. మనమే తనని తప్పుగా అపార్థం తీసుకున్నామని పారిజాతంతో జ్యోత్స్న అనగానే.. అప్పుడే దీప దగ్గరికి కార్తీక్ రావడం చూసిన పారిజాతం.. జ్యోత్స్నకి చూపిస్తుంది. దాంతో జ్యోత్స్న కోపంగా ఉంటుంది. మరొకవైపు శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను అంటాడు. మీ వాళ్ళ ఇప్పుడు మేం చాలా హ్యాపీగా ఉన్నాము.. మీరు కూడా మీ పెళ్లి గురించి ఆలోచించండి అని కార్తీక్ కి దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ అందరికి ఒక విషయం చెప్తానంటూ పిలుస్తాడు. సుమిత్ర వాళ్ళు అందరు వస్తారు. ఏం చెప్తాడో ఏంటో అని దీప, జ్యోత్స్న లు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.