English | Telugu

దీపని ఎటాక్ చేసింది మేము కాదంటూ డైవర్ట్ చేసిన పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -228 లో.....దీపపై ఎటాక్ చేయించింది జ్యోత్స్న అని కార్తీక్ కి డౌట్ వచ్చి వెంటనే ఫోన్ చేస్తాడు. పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నా భార్య పై ఎటాక్ చేయించింది మీరే కదా అని అడుగగా.. పారిజాతం టెన్షన్ పడుతుంది. జ్యోత్స్న ఏదో ఒకటి కవర్ చెయ్యమని చెప్తుంది. మేమ్ ఎందుకు ఎటాక్ చేస్తాం.. మాకేం అవసరం తన మాజీ భర్త అయి ఉండొచ్చు లేక అతని భార్య శోభ అయి ఉండొచ్చని కార్తీక్ మనసుని డైవర్ట్ చేస్తుంది పారిజాతం. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తుంది.

నేనే తప్పుగా అనుకున్నానా అని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు శౌర్య నాకు కబుర్లు చెప్పమని అంటుంది. నాకు పని ఉందంటూ కార్తీక్, దీపలు వెళ్తుంటే తను అలుగుతుంది. దాంతో ఇద్దరు పనులు మానేసి శౌర్యతో కబుర్లు చెప్తారు. కార్తీక్ కళ్ళు మండుతుంటే దీప చీర కొంగుతో శౌర్య ఆవిరి పడుతుంది. నాకు అమ్మకి నువ్వున్నావ్.. నీకు నేనున్నాను అని శౌర్య అనగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

మరుసటి రోజు ఉదయం జ్యోత్స్న పారిజాతంలు మాట్లాడుకుంటారు. దీపని ఏదో ఒకటి చెయ్యాలని జ్యోత్స్న అనగానే అప్పుడే సుమిత్ర వచ్చి‌.. ఏం చేస్తావ్? దీప జోలికి పోతేనే తను మీ జోలికి వస్తుంది. తన మంచిదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్నని మీరే చెడగొడుతున్నారని పారిజాతంపై కోప్పడుతుంది సుమిత్ర. ఎంతైనా సొంత కూతురు దీప కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందని జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్న ఆఫీస్ కి వెళదామని అంటాడు. దాంతో పారిజాతంకి జ్యోత్స్న బై చెప్పి వెళ్తుంది. అక్కడే ఉన్న సుమిత్రకి చెప్పదు. మరొకవైపు కార్తీక్ ఆఫీస్ కి రెడీ అవుతాడు. అప్పుడే దీప ఫైల్ తీసుకొని వస్తుంది. నాకు ఎందుకో ఈ రోజు ఆఫీస్ కి వెళ్లాలని లేదు దీప అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.