English | Telugu

మోనితను కార్తీక్‌ చంపాడని అనుకుంటున్న సౌందర్య!

మోనితను కార్తీక్ హత్య చేయలేదని, తానే హత్య చేశానని ఏసీపీ రోషిణి దగ్గరకు సౌందర్య వెళ్లిన సంగతి తెలిసిందే. 'ఈ రోజు హైదరాబాద్ వచ్చిన మీరు, నిన్న హత్య ఎలా చేశారు?' అని రోషిణి లాజిక్ తీస్తుంది. ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమైంది.

'మీరు చాలా తెలివైనవారు. నేను ఈ హత్య చేయలేదని కనిపెట్టగలిన మీరు, నా కొడుకు కూడా చేయలేద‌ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు?' అని రోషిణిని సౌందర్య ప్రశ్నిస్తుంది. అప్పుడు రోషిణి 'ఎందుకంటే నేను కార్తీక్ కన్నతల్లిని కాదు కాబట్టి. పోలీస్ అధికారిని కాబట్టి' అని సమాధానం ఇస్తుంది. 'ఈ హత్యను ఎవరైనా కళ్లారా చూశారా?' అని మళ్ళీ సౌందర్య ప్రశ్నిస్తుంది. 'మీ వియ్యపురాలు భాగ్యం అక్కడే ఉందట' అని రోషిణి సమాధానం. 'కళ్లారా చూసిందా? చెవులారా విందా?' - మళ్ళీ సౌందర్య ప్రశ్న.

"ఇది కోర్టు కాదు. నేను మీతో వాదిస్తూ కూర్చోలేను. మీరు కోడలి తరపున పోరాడిన ఉత్తమ అత్త అట కదా. మరి, మీ కొడుకు వేరే ఆడదానితో హద్దులు లేని స్నేహం చేస్తుంటే... చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఇప్పుడు ఆ ఆడదాన్నీ మీ కొడుకు తల్లిని చేసి, చంపేసి, చిద్విలాసంగా నవ్వుతూ మెట్టవేదాంతం చెబుతున్నాడు" అని రోషిణి గట్టిగా చెబుతుంది. అప్పుడు మోనిత ఆడిన పన్నాగాన్ని సౌందర్య బయటపెడుతుంది.

మోనితది కృత్రిమ గర్భధారణ అని, కావాలంటే మాతృశ్రీ సంతానసాఫల్య కేంద్రంలో పనిచేసే పల్లవిని అడగమని రోషిణికి సౌందర్య చెబుతుంది. అక్కడ నుండి విచారణ చేయమంటుంది. దాంతో రోషిణి షాక్ అవుతుంది. అయినా... నమ్మదు. సౌందర్య వెళ్లిన తర్వాత మోనితకు కడుపు చేసి, పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో చంపేశాడని అనుకుంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో కార్తీక్ కు రత్నసీత అని లేడీ కానిస్టేబుల్ టీ అందిస్తుంది. ఏమైనా కావాలంటే తనతో చెప్పమని, ఏర్పాటు చేస్తానని అంటుంది.

రోషిణితో మాట్లాడిన తర్వాత దీప దగ్గరకు వెళ్లిన సౌందర్య... కోడలు, పిల్లల్ని తనతో పాటు ఇంటికి తీసుకువెళుతుంది. భాగ్యం కూడా సౌందర్య ఇంటికి వెళుతుంది. అందరూ ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత 'ఇప్పుడు చెప్పు ఏం జరిగింది?' అని సౌందర్య అడగటంతో కార్తీక్ కు చూపించిన వీడియో అందరికీ చూపిస్తుంది దీప. హిమ మరణానికి తానే కారణం అన్నట్టు మోనిత చెబుతున్న మాటలు వినబడుతుంటే 'చంపేసే ఉంటాడు... మోనితను కార్తీక్ చంపేసి ఉంటాడు' అని సౌందర్య షాక్ అవుతుంది. అక్కడితో నేటికి శుభం కార్డు వేశారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.