English | Telugu

Karthika Deepam 2 : కార్తీక పౌర్ణమి రోజున కార్తీక్, దీపలు ఒక్కటయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -210 లో......జ్యోత్స్న గుడికి వెళ్తుంది. తనని చూసి కార్తీక్ కోప్పడుతుంటాడు. ఉండమంటే ఉంటాను లేదంటే వెళ్ళిపోతానని జ్యోత్స్న అనగానే.. సరే ఉండు అని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను దీప చెప్తుంది. ఆ తర్వాత శౌర్య బాగుండాలని దీప మొక్కుకొని కోనేటిలో వదులుతుంది. శౌర్య ఆరోగ్యం బాగుండాలని కార్తీక్ దీపం వదులుతాడు. జ్యోత్స్న మాత్రం కార్తీక్ జీవితం నుండి దీప వెళ్ళాలని కోరుకొని దీపం వదులుతుంది. ఆ తర్వాత కార్తీక్, దీప కోనేటీలో వదిలిన దీపాలు ఒక్క దగ్గరికి వస్తాయి.

దాంతో జ్యోత్స్న విడగొట్టాలని రాయి విసరబోతుంటే కార్తీక్ చూసి ఆపబోతుంటాడు. ఆ రాయి కాస్త జ్యోత్స్న వదిలిన దీపానికి తాకుతుంది. ఇక నీ బుద్ది మారదన్నట్లు జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత అందరు ఇంటికి వచ్చాక కార్తీక్ దీప దగ్గరికి వచ్చి.. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా అంటూ మాట్లాడతాడు. నాలాగా అందరికి దూరంగా మీరు ఉండడం ఇష్టం లేదని దీప అంటుంది. ఇన్ని రోజులు మీకు ఎలా హెల్ప్ చెయ్యాలంటూ కారణం వెతుకున్నేవాడిని కానీ అలా ఇప్పుడు లేదు.. మీరు నా కళ్ళ ముందే ఉన్నారని కార్తీక్ అంటాడు. కార్తీక్ అటువైపు తిరిగి మాట్లాడుతుంటే.. కార్తీక్ కాళ్ళు మొక్కుతుంది దీప. మీరు భర్తగా రావడం నా అదృష్టమని దీప అనుకుంటుంది.

మరొకవైపు పారిజాతానికి జ్యోత్స్న తన బాధని చెప్పుకుంటూ బాధపడుతుంది. నీకు ఆస్తులున్నాయి ఇంకేంటి అన్నట్లు పారిజాతం మాట్లాడుతుంది. నా బావ కూడా కావాలని అంటుంది. మరొకవైపు దాస్ కి ఒకతను ఫోన్ చేసి.. నువ్వు చెప్పిన అతను చనిపోయాడంట.. వాళ్ళింట్లో వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారని అతను అంటాడు. కనీసం పేరు అయిన చెప్పు అనగానే.. కుబేరుడు అని చెప్తాడు. ఆ తర్వాత కుబేర్ స్కెచ్ ఆర్ట్ ని పట్టుకొని చూస్తుంటే.. కాశీ వస్తాడు. అది చూసి ఏంటని అడిగితే దాస్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.