English | Telugu

Jayam serial : పారు నిజస్వరూపం తెలుసుకున్న రుద్ర.. శకుంతల కనుక్కోగలదా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -119 లో.. పారు పాయిజన్ తాగుతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడే పోలీసులు వస్తారు. నా చెల్లికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ గంగ అని హరి చెప్పగానే గంగని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పారుని హరి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత సారీ పెద్దనాన్న ఇలా జరుగుతుందనుకోలేదని పెద్దసారుతో రుద్ర అంటాడు.

నువ్వేం చేసినా అలోచించి చేస్తావ్.. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పారు గురించి కాదు గంగ గురించి.. తనని నువ్వే బయటకు తీసుకొని రావాలని పెద్దసారు అంటాడు. రుద్ర స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడే లక్ష్మీ కూడా వస్తుంది. గంగకి బెయిల్ ఇవ్వండి అని రుద్ర అడుగుతాడు. బెయిల్ కంటే ఈ కేసు వెనక్కి తీసుకొమ్మని చెప్పండి అని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే సరే నేను ట్రై చేస్తానని హరి దగ్గరికి రుద్ర వస్తాడు. కేసు వెనక్కి తీసుక్కొమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తీసుకోనని అతను తిరిగి పంపిస్తాడు. మరొకవైపు శకుంతల మనసులో ఇషిక, వీరు కలిసి రుద్ర, గంగ గురించి నెగెటివ్ క్రియేట్ చేస్తారు. కావాలనే డాక్టర్ తో మాట్లాడినట్లు వీరు యాక్టింగ్ చేస్తాడు. పారు కండిషన్ సీరియస్ అంట అని శకుంతలకి చెప్తాడు.

మరొకవైపు పారు, హరి హాస్పిటల్ లో మన ప్లాన్ సక్సెస్ అని మాట్లాడుకుంటుంటే.. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇచ్చి వాళ్ళ మాటలు వింటాడు. నైస్ ప్లే అని అంటాడు. గంగ దగ్గరికి వెళ్లేముందు నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నీ పగకోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నావని అర్థమైందని రుద్ర అన్నీ చెప్తుంటే పారు, హరి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.