English | Telugu

ఓటిటి కన్నా యూట్యూబ్ చాలా డేంజర్

ఆలీతో సరదాగా షో కొత్త కొత్త అంశాలను బయటికి తెస్తూ ఉంటుంది. ఇక రాబోయే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి అశ్వినీదత్ గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో అశ్వనిదత్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఓటిటి వ్యవస్థ కారణంగా థియేటర్లకు ఎవరూ వచ్చే అవకాశం ఉండదు కదా దీనిపై మీ అభిప్రాయం అని ఆలీ అడిగేసరికి ఓటిటి ఎంత మాత్రం ప్రమాదకరం కానీ కాదు యూట్యూబ్ ఈజ్ టూ డేంజరస్ అని చెప్పారు. ఆలీ తో సరదాగా షోకి అశ్వనీదత్ వచ్చి ఇద్దరూ కొట్టుకున్నారు అని యూట్యూబ్ లో పెడితే చాలు అన్ని పనులూ ఆపేసి మరీ ఆ న్యూస్ ని చదివేస్తారు.

ఇటీవలి కాలంలో చూస్తే స్ట్రైక్ అవి ఎక్కువయ్యాయి అని అడిగేసరికి మరి థియేటర్స్ రన్ అవ్వట్లేదు కదా. ఇండస్ట్రీ మొత్తాన్ని ముగ్గురు నలుగురు తమ చేతుల్లో పెట్టుకుని అన్ని థియేటర్స్ ని బ్లాక్ చేసేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ k సినిమా షూటింగ్ మొత్తం ఐపోయినట్టేనా అన్న ప్రశ్నకు చాలా వరకు పూర్తయ్యింది స్ట్రైక్స్ అవీ లేకపోతే షూటింగ్ పూర్తయ్యేది అన్నారు. ఇండస్ట్రీలో భారీ నిర్మాత అంటే అశ్వని దత్ పేరే చెప్తారు మరి మీరెందుకు నిరాశకు గురౌతున్నారు అన్న ప్రశ్నకు శక్తీ మూవీ తన లైఫ్ లో కోలుకోలేని దెబ్బ తీసిందని..ఆ మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళ నాన్న చనిపోవడం, రజనీకాంత్ గారు మాట వినకపోవడం, తన భార్య మాటల్ని లక్ష్య పెట్టకపోవడం అన్ని కలిసి తనని శక్తి హీనుడిని చేశాయని చెప్పుకొచ్చారు. బెస్ట్ ప్రొడ్యూసర్ స్వప్ననా, అశ్విని దత్త అని అడిగేసరికి ఈ తండ్రైనా తమ పిల్లలు తమని డామినేట్ చేస్తే చూడాలని అనుకుంటారు కదా నేను అంతే అని నవ్వేశారు అశ్వని దత్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.