English | Telugu

Illu illalu pillalu : అమ్మకి శుభలేఖ ఇచ్చిన వేదవతి.. కాల్చేయబోయిన భద్రవతి!



స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -123 లో.. చందుని శ్రీవల్లి ఇంటికి రమ్మని చెప్తుంది. చందు ఒక్కడే కాకుండా తన తమ్ముళ్లని వెంటపెట్టుకొని వస్తాడు. వాళ్ళ ముందు మాట్లాడడం కుదరదని భాగ్యం వాళ్లని బయటకు పంపిస్తుంది‌. ఇక భాగ్యం చెప్పినట్టుగా శ్రీవల్లి తన నటన మొదలుపెడుతుంది. మీకొక విషయం చెప్పాలి కానీ అది ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదండి.. నాకు టెన్షన్ గా ఉందని అంటుంటే ఏం పర్లేదు చెప్పండి అని చందు అంటాడు. అదంతా భాగ్యం దూరం నుండి చూస్తుంటుంది. ఈ పెళ్లి ఒక పది రోజులు వాయిదా వెయ్యండి అని శ్రీవల్లి చెప్తుంది. ఎందుకని చందు అడుగుతాడు.. మా వాళ్ళు డబ్బులు ఎవరికో అవసరం అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు.. ఈ విషయం మా వాళ్ళు మీ వాళ్ళతో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకే మీతో చెప్తున్నానని శ్రీవల్లి అంటుంది.

అదంతా విని చందు షాక్ అవుతాడు. పెళ్లిపత్రికలు పంచాకా ఇప్పుడు వాయిదా అంటున్నారు. ఈ విషయం మా నాన్న కి తెలిస్తే తట్టుకోలేడు. నా వాళ్ళ మా నాన్న బాధపడకూడదని చందు ఎమోషనల్ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి వేరే ఆప్షన్ లేదని శ్రీవల్లి ఏడుస్తుంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఆలోచించాలి.. డబ్బు ఎంత కావాలి అని చందు అడుగుతాడు. ఒక పది లక్షలు అని శ్రీవల్లి చెప్తుంది. పది లక్షలు సరే నేను ట్రై చేస్తానమని చందు చెప్పగానే శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా వెనకుండి నడిపిస్తున్న భాగ్యం చూసి ఖుషి అవుతుంది. మరొకవైపు వేదవతి తన గుమ్మం ముందు నిలబడి వాళ్ళ అమ్మ బయటకు వస్తుందా అని చూస్తుంటుంది. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటి అత్తయ్య అని అడుగుతుంది. మా అమ్మ కోసం మొదటి శుభలేక తనకి ఇవ్వాలని చూస్తున్న కానీ తను బయటకు రావట్లేదని వేదవతి అంటుంది దాంతో మీకు ఇష్టమైన సాంగ్ ఉంది కదా అది ప్లే చేస్తే బయటకు వస్తుందని ప్లే చేస్తుంది. అది వినగానే వేదవతి వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది.

మొదటి శుభలేఖలు నీకే నువ్వు చందు పెళ్లికి తప్పకుండా రావాలని వేదవతి అనగానే.. నా మనవడి పెళ్లికి తప్పకుండా వస్తానని తను లోపలికి వెళ్తుంది. మరొకవైపు పది లక్షల గురించి చందు ఆలోచిస్తుంటాడు. అప్పుడే సాగర్ ధీరజ్ ఇద్దరు స్వీట్ తీసుకొని భాగ్యం ఇంటికి వస్తారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటని ధీరజ్ అంటాడు. అదేం లేదని భాగ్యం కవర్ చేస్తుంది. సాగర్ ధీరజ్, చందు, శ్రీవల్లి అందరు సెల్ఫీ తీసుకుంటారు. ఇక వాళ్ళు వెళ్లిపోతుంటే డబ్బుల విషయం వాళ్లకి చెప్పకని శ్రీవల్లితో భాగ్యం అనగానే.. చందుని పిలిచి డబ్బుల గురించి మీ వాళ్ళకి చెప్పకండి అని చెప్తుంది. దానికి చందు సరే అంటాడు. ఈ అన్నదమ్ముల మ్యాటర్ చూడాలి.... మా అల్లుడు వాళ్ళ మాట వింటే నా కూతురు మాట ఎలా వింటాడని భాగ్యం అనుకుటుంది. తరువాయి భాగంలో రామరాజు శుభలేఖలు ఇస్తుంటాడు. మరొకవైపు వేదవతి వాళ్ళ అమ్మకి ఇచ్చిన కార్డు చూసి ఆ ఇంటి శుభలేఖ మన ఇంట్లో ఏంటని భద్రవతి కాల్చేయబోతుంటే విశ్వ వచ్చి ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.