English | Telugu

మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు.. తారక్ సందడి మొదలైంది!

గతంలో బిగ్ బాస్ షోతో అలరించిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నారు‌. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రోమోలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షోకి సంబంధించి మరో ప్రోమో వచ్చింది. ఈ షో ఈ నెలలోనే ప్రసారం కానుందని తెలుపుతూ శనివారం ఓ ప్రోమోను విడుదల చేశారు.

తాజాగా విడుదల చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోమో ఆకట్టుకుంటోంది. స్కూల్‌ లో పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని టీచర్ అడిగిన ప్రశ్నకు.. కలెక్టర్‌, పైలెట్‌, సీఎం అంటూ విద్యార్ధులు రకరకాల సమాధానాలు చెప్పగా.. ఒక అమ్మాయి మాత్రం 'అమ్మను అవుదాం అనుకుంటున్నా' అని చెప్తుంది. పెద్దయ్యాక ఆ అమ్మాయ్యే షోలో తారక్ ముందు హాట్‌ సీట్‌లో కూర్చునే అవకాశం అందుకొని.. అమ్మ గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆ తర్వాత 'ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు. కథ మీది, కల మీది.. ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం' అంటూ మీసం మెలేసి తారక్‌ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

ఇక షో ఆగష్టు నుంచే ప్రసారం కానుందని ప్రోమోలో తెలిపారు. మొదటి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రానున్నారని సమాచారం.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.