English | Telugu

అడ్డంగా బుక్కైన దీప్తి సున‌య‌న‌!

బిగ్‌బాస్ స్టేజ్‌పై ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ప్రియురాలు దీప్తి సున‌య‌న క‌నిపించి ర‌చ్చ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. ముందు షన్ను కోసం అత‌ని బ్ర‌ద‌ర్ రాండంతో కొంత నిరాశ చెందిన ష‌న్ను ఆ త‌రువాత దీప్తి ఎంట్రీ ఇచ్చేసే స‌రికి అంతులేని ఆనందంతో ఎగిరి గెంతులేశాడు. దీప్తిని స్టేజ్‌పై చూసిన త‌రువాత ష‌న్నులో ఎక్క‌డ‌లేని కొత్త ఉత్సాహం క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా దీప్తి సున‌య‌న బిగ్‌బాస్ స్టేజ్‌పై చేసిన ర‌చ్చ‌పై సోష‌ల్ మీడియాలో భీభ‌త్స‌మైన ట్రోలింగ్ న‌డుస్తోంది.

దీప్తి సున‌య‌న స్టేజ్‌పై ప‌క్క‌న నాగ్ స‌ర్‌తో పాటు ష‌న్ను బ్ర‌ద‌ర్ వుండ‌గానే త‌న యాటిట్యూడ్‌ని చూపించింద‌ని, అంతే కాకుండా ష‌న్నుని త‌ప్ప హౌస్‌లో వున్న‌ మిగ‌తా కంటెస్టెంట్‌ల ముఖాల‌ని కూడా చూడ‌లేద‌ని ఓ రేంజ్‌లో దీప్తిని ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా కోట్లాది మంది ప్రేక్ష‌కులు చూస్తుండ‌గా దీప్తి ష‌న్నుకి ఏఓ సిగ్న‌ల్స్ ఇచ్చింద‌ని విమ‌ర్శలు మొద‌ల‌య్యాయి. దీంతో రంగంలోకి దిగిన దీప్తి వివర‌ణ ఇచ్చింది. ఇన్‌స్టా వేదిక ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది.

`నేను చాలా మాట్లాడుదాం.. అంద‌రికి చాలా చెబుదాం అనుకున్నా..టీమ్ ప్రెష‌ర్ వ‌ల్ల తొంద‌ర‌గా మాట్లాడి వ‌చ్చా. లాస్ట్‌లో వెళ్లా క‌దా టైమ్ కూడా లేకుండే. నేను స్టేజ్ ఒదిలివెళ్లాక గుర్తొచ్చింది నేను ఎవ‌రితోనూ మాట్లాడ‌లేద‌ని. ష‌న్నుతో మాట్లాడుతూ అస‌లు మ‌ర్చిపోయా. అక్క‌డ చెప్ప‌డం మ‌ర్చిపోయి ఉప్పుడు చెబుతున్నా.. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వ‌న్‌. నాది యాటిట్యూడ్ కాదు మ‌ర్చిపోయా. పోయిపోయి అక్క‌డే చూయిస్తానా యాటిట్యూడ్‌` అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది దీప్తి సున‌య‌న‌.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.