English | Telugu

డాన్స‌ర్ కేవల్ మృతి... విషాదంలో 'ఢీ' ఫ్యామిలీ

యువ డాన్సర్ కేవల్ తమంగ్ మృతి చెందాడు. తెలుగు డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో పాటు హిందీ డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ప్లస్'లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కేవల్ కొన్ని రోజులుగా బ్లడ్ కాన్సర్ తో పోరాడుతున్నాడు. అతడిని కాపాడటం కోసం కొరియోగ్రాఫర్ యశ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సహాయం చేయమని ప్రముఖులను, ప్రేక్షకులను కోరాడు. ప్రియమణి, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, మేఘన తదితరులు ముందుకొచ్చారు. విధిరాత ముందు వీరి ప్రయత్నం తల వంచక తప్పలేదు.

కేవల్ తమంగ్ ఆదివారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతడి మరణవార్తను ధృవీకరిస్తూ యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నువ్వు లేవనే విషయాన్ని మనసుకు తీసుకోలేకపోతున్నాను. నేను ఇది భరించలేకపోతున్నాను. స్వర్గంలో విశ్రాంతి తీసుకో బ్రదర్. నన్నెప్పటికీ, జీవితాంతం ఈ వేదన వెంటాడుతుంది. నేనింకా నువ్వున్నట్టు ఫీలవుతున్నా. చాలా త్వరగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయావ్" అని యశ్ పోస్ట్ చేశాడు. కేవల్ మృతిపై పలువురు టీవీ ప్రముఖులు, డాన్సర్లు సంతాపం వ్యక్తం చేశారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.