English | Telugu

మోస్ట్ ఎమోషనల్ గా ఫ్యామిలీ వీడియోస్.. అవినాష్ ఆల్ రౌండ్ పర్ఫామెన్స్!

బిగ్ బాస్ సీజన్-8 తెలుగు ఎనిమిదో వారం ముగింపుకి వచ్చేసింది. త్వరలోనే ఫ్యామిలీ వీక్ రాబోతుంది. ఆ లోపు శాంపిల్ గా కంటెస్టెంట్స్ కి వాళ్ళ ఫ్యామిలీ నుండి వీడియో బైట్ లని చూపించాడు బిగ్ బాస్. అయితే ఆ అవకాశం అందరికి రాలేదు.

ప్రేరణ, నిఖిల్, గౌతమ్, గంగవ్వ లకి తప్ప అందరికి తన ఫ్యామిలీ నుండి వీడియో బైట్ చూసే అవకాశం వచ్చింది. మొదటగా బిగ్ బాస్ ఫోన్ చెయ్యగానే.. నబీల్ లిఫ్ట్ చేస్తాడు. ఫ్యామిలీ వీడియో నీకు కావాలా పృథ్వీకి ఇస్తావా అని అడుగగా.. నాకే కావాలని అంటాడు నబీల్. దాంతో నబీల్ వాళ్ళ అన్న, అమ్మ మాట్లాడింది చూపిస్తారడు బిగ్ బాస్. ఇక అది చూసిన నబీల్ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత నయనికి తన సిస్టర్ మాట్లాడిన వీడియో చూపిస్తాడు బిగ్ బాస్. టేస్ట్ తేజ కి తన పేరెంట్స్ వీడియో చూపిస్తాడు బిగ్ బాస్. మా అమ్మ బిగ్ బాస్ టీవీలో కనపడింది చాలు అంటూ తేజ ఎమోషనల్ అవుతాడు. విష్ణు ప్రియకి తనకి తెలిసిన వాళ్ళ వీడియో, పృథ్వీకి తన బ్రదర్ వీడియో, రోహిణి కి తన మదర్ వీడియో, అవినాష్ కి తన బ్రదర్ వీడియో, యష్మీకి తన పేరెంట్స్ నుండి.. హరితేజకి తన కూతురు వీడియో చూపించేసి అందరిని ఎమోషనల్ చేస్తాడు‌ బిగ్ బాస్ మామ.

ఆ తర్వాత హౌస్ లో దీపావళి సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు కంటెస్టెంట్స్. అవినాష్ కి పాల పాకెట్స్ కావాలంటే బిగ్ బాస్ తనని రెండు నిమిషాలు ఎంటర్టైన్మెంట్ చెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు. టైమ్ ఇవ్వండి బిగ్ బాస్ అని అవినాష్ అనగా.. టైమ్ నేను చూస్తాను.. టైమింగ్ నువ్వు చూస్కో అనినాష్ అంటూ బిగ్ బాస్ మామ చెప్తాడు. దాంతో హౌస్ అంతా ఫుల్ గా అరిచేస్తారు.‌ ఇక అవినాష్ చిరంజీవి, రాజశేఖర్, సాయి కుమర్ లా చేసి కడపుబ్బా నవ్విస్తాడు. ఇక అలా నవ్వించినందుకు రెండు పాల పాకెట్లు పంపిస్తాడు బిగ్ బాస్. ఫ్యామిలీ వీడియోస్ అనంతరం అందరు కలిసి భోజనం చేస్తారు. ఏదేమైనా నిన్నటి ఎపిసోడ్ మోస్ట్ ఎమోషనల్ గా సాగింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.