English | Telugu

కామెడీ స్టార్స్ ధ‌మాకా.. త‌గ్గేదేలే: నాగ‌బాబు

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ గ‌త కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని న‌వ్విస్తూ అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ కాస్త `ఎక్స్ ట్రా జ‌బ‌ర్వ‌స్త్‌`గా మారిపోయింది. ఎంట‌ర్‌టైన్ మ‌రింత డోస్ పెంచేసింది. అంతే కాకుండా `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` కూడా కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా వీటికి పోటీగా ఓంకార్ `స్టార్ మా` లో స్టార్ట్ చేసిన షో `కామెడీ స్టార్స్‌`. గ‌త కొన్ని నెల‌లుగా హాస్య ప్రియుల్ని ఆక‌ట్టుకుంటూ ప్ర‌తీ ఆదివారం విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న ఈ కామెడీ షో ఇప్పుడు పేరు మారిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ షోలో శేఖ‌ర్ మాస్ట‌ర్‌, న‌టి శ్రీ‌దేవి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం జ‌రుగుతోంది. ఇక ఈ షోకు యాంక‌ర్ గా ప్ర‌స్తుతం శ్రీ‌ముఖి వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా శ్రీ‌దేవిని త‌ప్పించి ఆ స్థానంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌డ్జిగా వ‌చ్చేశారు. ఇక్క‌డి నుంచి కొన్ని కొత్త టీమ్ లు షో లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. తాజాగా ఈ షోకు `కామెడీ స్టార్ ధ‌మాకా` అని పేరుని మార్చేశారు. ఈ షోలో కొత్త‌గా `ఎక్స్ ట్రా జ‌బర్ద‌స్త్`, ఢీ షోల్లో హైప‌ర్ ఆదికి జోడీగా క‌నిపించి ఆ త‌రువాత షో నుంచి అర్థాంత‌రంగా వెళ్లిపోయిన దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా కొత్త త‌ర‌హా కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షో ఈ నెల 23 నుంచి ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు `స్టార్ మా`లో ప్ర‌సారం కాబోతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని రిలీజ్ చేశారు. వైర‌స్ ఇన్ని వేరియేష‌న్స్ తో వ‌స్తుంటే అంద‌రిని న‌వ్వించే కామెడీ స్టార్స్ ఇంకెన్ని వేరియేష‌న్స్ తో ఎంత అప్‌డేట్ గా ...ఎంత కొత్త‌గా వ‌స్త‌దో.. త‌గ్గేదే లే` అంటూ నాగ‌బాబు డైలాగ్ చెప్ప‌డం... ఇందులో స్కిట్ లు చేసే కంటెస్టెంట్ లు నానా హంగామా చేస్తున్న తీరు ఓ రేంజ్ లో ఈ షోని టాప్ లో నిల‌బెట్టేలా వున్నాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.