English | Telugu

మహేష్ బాబు 1 నేనొక్కడినే మూవీకి ట్రాక్ చెప్పా..నన్నంతా రౌడీ అనుకునేవాళ్లు

బర్దస్త్ లో బులెట్ భాస్కర్ టీమ్ అంటే చాలు ఆడియన్స్ పడీపడీ నవ్వుతారు. ఎందుకంటే ఆ టీమ్ లో పటాస్ ఫైమా, నాటీ నరేష్ ఉంటారు. వీళ్ళ టీమ్ చేసే స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ అవ్వొచ్చు. అందుకే జడ్జ్ ఖుష్బూకి కూడా వీళ్ళ టీమ్ మీద స్పెషల్ ఇంటరెస్ట్ ఉంటుంది. ఇక ఒక చిట్ చాట్ సందర్భంగా బులెట్ భాస్కర్ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇలా చెప్పుకొచ్చాడు."కాలేజీ చదివేటప్పుడు నా పర్సనాలిటీని చూసి అందరూ రౌడీని అనుకునేవాళ్లు కానీ అలా ఉండేవాడిని కాదు. ఇంద్రజ గారు, ఖుష్బూ గారు ఇద్దరూ పెద్ద లెజెండ్స్..

ఇద్దరిలో కూల్ ఎవరు, హాట్ ఎవరు అని చెప్పమంటే చాలా కష్టం. ఇంద్రజ గారు హాట్, ఖుష్బూ గారు కూల్ ఎప్పుడు ఇలా ఉంటారంటే సెట్ బాయ్స్ ఎవరైనా అరిచినప్పుడు...మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే మూవీకి ఒక వారం రోజుల పాటు ట్రాక్ చెప్పాను. మూవీస్ లోకి ఇంకా వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే జబర్దస్త్ లో మిగతా ఈవెంట్స్ లో ఫుల్ బిజీ టీమ్ మాది. ముందు డబ్బులు సంపాదించి పక్కన పెట్టుకున్నాక అప్పుడు సినిమాల్లోకి వెళదామని ఆగా. నాకు హైదరాబాద్ అంటేనే భయం. వైజాగ్ లో మంచి శాలరీతో జాబ్ చేసుకునేవాడిని. ఎక్కువగా జీతం ఇస్తామని చెప్పినా హైదరాబాద్ వెళ్ళలేదు. కానీ దేవుడు ఇదంతా చేసాడు. హైదరాబాద్ కి తీసుకొచ్చాడు. దాంతో టీవీలోకి వచ్చాము..రేపు సినిమాల్లోకి వెళ్తాం.. అంతా ఆ దేవుడి మాయ. " అంటూ చెప్పుకొచ్చాడు బులెట్ భాస్కర్.. బులెట్ భాస్కర్ తానూ చేసే ప్రతీ ఈవెంట్ లో ఎవరు ఉన్నా లేకపోయినా నాటీ నరేష్ ఉండాల్సిందే. వీళ్ళ ఫ్రెండ్ షిప్ అలాంటిది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.