English | Telugu

Brahmamudi: రాహుల్ వెన్నుపోటు.. రాజ్, కావ్య నిజం తెలుసుకుంటారా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -904 లో... కేరళ నుండి రాజ్, కావ్య ఇంటికి వస్తారు. మీరు మమ్మల్ని ఎందుకు మోసం చేసారు, కావ్యకి ప్రాబ్లమ్ లేదని ఎందుకు చెప్పారని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇప్పుడు కావ్యకి ఏం ప్రాబ్లమ్ లేదని కేరళ వైద్యం గురించి చెప్తాడు. దాంతో ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.

అప్పుడే ఒకతను ఫోన్ చేసి బిజినెస్ ఎక్సలెంట్ అవార్డు ఏ టైమ్ కి వస్తున్నారని అడుగుతారు. అవార్డు ఏంటని ఆశ్చర్యంగా అడుగుతాడు రాజ్. ఆ తర్వాత నేను చెప్తాను రాజ్ అని స్వప్న అంటుంది. చాలా తక్కువ టైమ్ లోనే రాహుల్ మంచి పేరు సంపాదించి అందరి ద్రుష్టిని తనవైపుకి తిప్పుకున్నాడని చెప్తుంది. దాంతో రాజ్, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

మరొకవైపు అప్పు కేసు గురించి బయటకు వెళ్ళాలని కళ్యాణ్ కి చెప్తుంది. ఇద్దరం వెళ్తే డౌట్ వస్తుంది. నువ్వు ఒక్కదానివే వెళ్ళు.. నేను ఇంట్లో కవర్ చేస్తానని అంటాడు. అప్పుని ఎవరు చూడకుండా కార్ ఎక్కించి పంపిస్తాడు. అది ప్రకాష్ చూస్తాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, అప్పు కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంటే కళ్యాణ్ ఆపి.. అప్పు బాత్రూంలో ఉంది. నేను తీసుకొని వెళ్తానని అంటాడు. సరే అని ధాన్యలక్ష్మి వెళ్తుంది. అదేంట్రా అప్పుని కార్ ఎక్కించి పంపించావని ప్రకాష్ అనగానే కళ్యాణ్ టెన్షన్ పడుతూ అతన్ని డైవర్ట్ చేస్తాడు.

ఆ తర్వాత రాజ్, కావ్య ఇంకా స్వప్న, రాహుల్ నలుగురు అవార్డు ఫంక్షన్ కి వెళ్తారు. నువ్వు ఇంత త్వరగా బిజినెస్ లో సక్సెస్ సాధించావ్ కాబట్టి నీకు గిఫ్ట్ అని రాహుల్ కి రాజ్ వాచ్ ఇస్తాడు. ఇంత ఖరీదైనది ఎందుకని రాహుల్ అంటాడు. ఆ తర్వాత నలుగురు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.