English | Telugu

Brahmamudi : రుద్రాణి దొంగ.. స్వరాజ్ ని ప్రేమగా చూసుకుంటున్న అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -824 లో....కావ్య నువ్వు వెళ్లి నీకు ఇచ్చిన నెక్లెస్ పెట్టుకొని రా అని అపర్ణ పంపిస్తుంది. కావ్య లాకర్ లో చూసేసరికి నెక్లెస్ ఉండదు. అదే విషయం అందరికి చెప్తుంది. ఎవరు తీశారు.. ఎక్కడ ఉంది.. అందరం మనమే కదా అని రాజ్ అంటాడు. మనం కాకుండా వీళ్ళు వచ్చారు కదా అని రేవతి పేరు చెప్తుంది. రుద్రాణి తన బ్యాగ్ లో వెతకాలని రేవతి బ్యాగ్ చెక్ చేస్తుంది కానీ అందులో ఏముండదు. నేను ఇందులోనే వేసాను కదా లేదేంటని రుద్రాణి షాక్ అవుతుంది.

నెక్లెస్ ఏమైంది అని అందరు అంటుంటే.. అప్పుడే స్వరాజ్, కనకం ఎంట్రీ ఇస్తారు. నాకు నెక్లెస్ ఎక్కడుందో తెలుసని అపర్ణని తీసుకొని స్వరాజ్, రుద్రాణి రూమ్ లో ఉన్న కబోర్డ్ చూపించి ఇందులో ఉందని చెప్తాడు. అపర్ణ నెక్లెస్ చూసి కోపంగా కిందకి వెళ్తుంది. నెక్లెస్ ఎక్కడ దొరికింది వదిన అని రుద్రాణి అడుగుతుంది. నీ గదిలోనే అని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. నేను తియ్యడం ఏంటని రుద్రాణి అంటుంది. అందరు తనపై కోప్పడతారు.

ఆ తర్వాత ఆ నెక్లెస్ ఎలా వచ్చిందని రుద్రాణి ఆలోచిస్తుంటే నేనే పెట్టాను.. నువ్వు మా అమ్మని ఇరికించాలని ట్రై చేసావ్ కానీ నువ్వే ఇలా అయ్యావని స్వరాజ్ అంటాడు. స్వరాజ్ తో పాటు కనకం కూడా ఉంటుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. సుభాష్ , అపర్ణ ఇద్దరు స్వరాజ్ ని ప్రేమగా చూసుకుంటే రేవతి అది చూసి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.