English | Telugu

Brahmamudi : వినాయకుడి పూజలో భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటవ్వగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -522 లో......కావ్య వినాయకుడి విగ్రహానికి కలర్ వేస్తుంటుంది. అప్పుడే కృష్ణ మూర్తి వచ్చి ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. ఇది ఈ రోజే పూర్తి చేయాల్సిన విగ్రహమని కావ్య అంటుంది. ఈ వినాయకుడి ద్వారా అయిన అల్లుడు నువ్వు ఇద్దరు ఒకటి అయితే బాగుండని కృష్ణమూర్తి అనగానే... కావ్య కోపంగా చూస్తుంది. దాంతో కృష్ణమూర్తి లోపలికి వెళ్తాడు. మరొకవైపు సీతారామయ్య ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. ఈసారి వినాయకుడి గురించి అందరు మర్చిపోయినట్లున్నారు ఏర్పాట్లు చెయ్యడం లేదని అంటాడు.

ఆ తర్వాత నా భార్య బాగోలేదు.. నా కోడలు ఇంట్లో లేదు.. ఇప్పుడు ఎందుకని ప్రకాష్ అనగానే.. ఐశ్వర్యం ఆనందం ఉంటేనే దేవుడిని పూజిస్తావా.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిని పూజిస్తే ప్రశాంతంగా ఉంటుందని సీతారామయ్య అంటాడు. ఈ సారి రాజ్ ఒక్కడే ఈ ఏర్పాట్లు చెయ్యాలని సీతారామయ్య చెప్తాడు. అందరు వెళ్ళిపోతారు. రాజ్ వెళ్తుంటే నువ్వు ఒక్కడివి చేస్తే అయిన పక్క వాళ్ళ మాటలు పట్టించుకొని భార్యని దూరం పెట్టే అజ్ఞానం నుండి బయటకు వస్తావని అపర్ణ అంటుంది. మరొకవైపు మన పెళ్లి అయ్యాక వస్తున్న మొదటి వినాయకుడి పండుగ జరుపుకోవాలని అప్పుతో కళ్యాణ్ అంటాడు. నాకు వినాయకుడిని నేను తయారు చెయ్యడం వచ్చని అప్పు అంటుంది. ఆ తర్వాత అప్పు వినాయకుడిని తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసుకొని రెడీ చేస్తుంటే.. అప్పుడే బంతి కృష్ణమూర్తి విగ్రహం పంపాడని తీసుకొని వస్తాడు.

ఆ తర్వాత కావ్య తను రెడీ చేసిన విగ్రహం షాప్ అతనికి ఇవ్వడానికి వస్తుంది. ఆ తర్వాత కావ్య సైకిల్ పై వెళ్తుంటే.. అప్పుడే రాజ్ కార్ పై వచ్చి కావ్యకి డాష్ ఇస్తాడు. ఇద్దరు కాసేపు గొడవ పెట్టుకుంటారు. జీవితంలో ఎప్పుడు నీ దగ్గరికి రానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో పూజకోసం రాజ్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక కావ్యకి ఫోన్ చేయమని ఇందిరాదేవి అంటుంది. ఎందుకని రాజ్ అనగానే.. పూజ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే బాగుంటుందని అపర్ణ అంటుంది. ఈ పూజలో మీ దంపతులు కూర్చోవాలని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ లు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.