English | Telugu

బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్ హంగామా

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్. అత్య‌ధిక కాంట్ర‌వ‌ర్సియ‌ల్ షోగా రికార్డు సాధించింది. ఈ షో చుట్టూ ఎలాంటి వివాదాలు, విమ‌ర్శ‌లు త‌లెత్తినా నిర్వాహ‌కులు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నారు. గ‌త ఏడాది సీజ‌న్ 5 ని విజ‌య‌వంతంగా పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. ఈ షో పూర్త‌యిన వెంట‌నే ఓటీటీ వెర్ష‌న్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ని ప్రారంభించేశారు. ఇది కూడా వివాదాలు, గొడ‌వ‌లు, కంటెస్టెంట్ ల అల‌క‌ల మ‌ధ్య మొత్తానికి ఎండ్ అయింది. మ‌హిళా కంటెస్టెంట్ విజేత‌గా నిల‌వ‌డం లేదు అంటూ వినిపిస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ బిగ్ బాస్ నాన్ స్టాప్ వెర్ష‌న్ కు బిందు మాధ‌వి విజేత‌గా నిలిచి మ‌హిళా ప్రేక్ష‌కుల్ని సంతృప్తి ప‌రిచింది.

తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ పూర్త‌యిపోవ‌డంతో మ‌ళ్లీ టెలివిజ‌న్ వెర్ష‌న్ బిగ్ బాస్ సీజ‌న్ 6 ని ప్రారంభించ‌బోతున్నారు. ఇందుకు సంబ‌ధించిన ప్రోమోని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈ సీజ‌న్ లో సామాన్యుల‌కు గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నామంటూ నాగార్జున అనౌన్స్ చేసిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 6ని చాలా గ్రాండ్ గా ప్రారంభించ‌డానికి స్టార్ మా వ‌ర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి కూడా. ఇదిలా వుంటే టెలివిజ‌న్ చ‌రిత్ర‌లోనే ఫ‌స్ట్ టైమ్ `బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్` హంగామా ని నిర్వ‌హిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు 100 రోజుల చేసిన హంగామాని ఒక్క రోజులోనే టీవీ న‌టుల‌తో చేయించి ర‌చ్చ ర‌చ్చ చేయ‌బోతున్నారు. 16 మంది టాప్ టెలివిజ‌న్ సీరియ‌ల్స్ స్టార్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి వారితో హంగామా చేయ‌బోతున్నారు. ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. 24 గంట‌ల పాటు ప్ర‌ముఖ పాపుల‌ర్ సీరియ‌ల్స్ లోని 16 మంది పాపుల‌ర్ టీవీ న‌టీన‌టులు క‌లిసి ఈ షోలో హంగామా చేయ‌బోతున్నారు. మ‌ధ్య‌లో దేత్త‌డి హారిక‌, ర‌ష్మీ గౌత‌మ్ స్పెష‌ల్ డ్యాన్స్ లు, టీవీ న‌టులు చేసే ర‌చ్చ‌, వాళ్లు ఆడే గేమ్స్‌, డ్యాన్సులు.. ల‌వ్ ట్రాక్ లు ఒక‌టి కాదు ఇలా ప్ర‌తీదీ బిగ్ బాస్ ఇంట్లో ఒక్క‌రోజు, 24 గంట‌ల్లో చేసిన ర‌చ్చ‌ని ప్ర‌త్యేకంగా `బిగ్ బాస్ ఇంట్లో మా ప‌రివార్‌` పేరుతో చూపించ‌బోతున్నారు. ఈ ప్ర‌త్యేక షో త్వ‌ర‌లోనే స్టార్ మాలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమోని రీసెంట్ గా విడుద‌ల చేశారు. ప్రోమో మామూలుగా లేదు. ఇక షో ఎలా వుంటుందో ఊహించుకోవ‌చ్చు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.