English | Telugu

ఒక్క అడుగు దూరంలో కామనర్స్...హౌస్ లోకి వెళ్ళెదెవరు!

నిన్న జరిగన అగ్నిపరీక్ష ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఫుల్ జోష్ తో వచ్చారు. ఇక జడ్జెస్ ఎప్పటిలాగ కాకుండా కూల్ గా మాట్లాడతారు. ఇది లాస్ట్ ఛాన్స్.. ఇప్పటివరకు మిమ్మల్ని లైవ్ గా చుసాం.. ఇంకా రెండు రోజుల్లో టీవీలో చూస్తాం ఈ రెండు రోజులు బాగా ఆడండి అని అభిజిత్ చెప్తాడు. ఉన్న పదమూడు మందిలో ఓటింగ్ చూసి ఇక్కడ పర్ఫామెన్స్ చూసి అయిదుగురిని బిగ్ బాస్ సీజన్-9 లోకి పంపిస్తామని శ్రీముఖి చెప్తుంది.

ఇది లాస్ట్ పరీక్ష మహాపరీక్ష అని శ్రీముఖి టాస్క్ అందరికి వివరిస్తుంది. మొదటగా దివ్య ప్రియని సెలక్ట్ చేసుకుంది. వాళ్ళకిద్దరికి పెట్టిన టాస్క్ లో దివ్య గెలిచి మహాపరీక్ష నుండి ప్రియ అవుట్ అవుతుంది. దివ్య టాస్క్ గెలిచింది కాబట్టి తనకి మరొక ఛాన్స్ ఉంటుంది. దాంతో శ్రేయని దివ్య సెలక్ట్ చేసుకుంటుంది. ఆ టాస్క్ లో కూడా దివ్య గెలుస్తుంది. శ్రేయ మహాపరీక్ష నుండి అవుట్ అవుతుంది. ఆ తర్వాత షకీబ్ కి ఛాన్స్ వస్తుంది. తను హరీష్ ని సెలక్ట్ చేసుకుంటాడు. అందులో హరీష్ గెలుస్తాడు. షకీబ్ ఓడిపోయి మహాపరీక్ష నుండి అవుట్ అవుతాడు. ఆ తర్వాత హరీష్ నాగని సెలక్ట్ చేసుకుంటాడు. అందులో నాగ ఓడిపోయి మహపరీక్ష టాస్క్ నుండి అవుట్ అవుతాడు.

హరీష్, దివ్య చెరో రెండు టాస్క్ లు గెలుస్తారు. హరీష్ కి ఛాన్స్ రాగా అతను దివ్యని సెలక్ట్ చేసుకుంటాడు. ఇద్దరికి కలిసి టాస్క్ ని వివరిస్తుంది శ్రీముఖి. కానీ ఈ టాస్క్ ఇప్పుడు జరగదు.. ఎంత క్యూరియాసిటి ఉంది అందరిలో ఈక్వల్ ప్లేస్ లో ఉన్న వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామని శ్రీముఖి ట్విస్ట్ ఇస్తుంది. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.