English | Telugu

Bigg Boss 9 Winner: బిగ్ బాస్-9 విన్నర్ కళ్యాణ్ పడాల.. ఇమ్మాన్యుయేల్ కి అన్యాయం జరిగిందా?

బిగ్ బాస్ సీజన్-9 ముగిసింది. అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో కామనర్ పవన్ కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చివరి వరకూ విన్నర్ రేసులో నిలిచిన తనూజ గౌడ రన్నరప్‌గా నిలిచింది.

ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. పదిహేను వారాలు హౌస్ లో ప్రతీ గేమ్ ఆడి.. ఎంతో మంది అభిమానుల్ని పొందాడు పవన్ కళ్యాణ్ పడాల. ఇక టాప్-5 కోసం జరిగిన పోటీలో డీమాన్ పవన్ ని ఓడించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్.

ఇక బిగ్ బాస్ సీజన్-9 లో అల్టిమేట్ గేమర్ ఎవరంటే చాలామంది ఉన్నారు.. కానీ ఇమ్మాన్యుయేల్ రియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు‌‌. అతడికి అన్యాయం జరిగింది. ఎందుకంటే తన స్కిట్స్ తో షోని టాప్ కి తీసుకెళ్ళాడు. ప్రతీ సీజన్ లో లాగే అతడిని టాప్-5 దాకా ఉంచి, నాలుగో స్థానంలో ఎలిమినేషన్ చేశారు. లేదంటే అతను రన్నరప్ అయ్యేవాడు.

ఇక తనూజ ఫ్యాన్స్ కి ఇది పెద్ద డిజప్పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్, తనూజ ఇద్దరు నామినేషన్ లో ఉన్నప్పుడు తనూజకే అత్యధిక ఓట్లు వచ్చేవి.. తనే ఫస్ట్ పొజిషన్ లో ఉండేది.

నిన్నటి గ్రాంఢ్ ఫినాలే ఎపిసోడ్ లో సంజనని టాప్-5 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేయగా, ఇమ్మాన్యుయేల్ ని నాలుగో స్థానంలో ఎలిమినేషన్ చేశారు. డీమాన్ పవన్ పదిహేను లక్షలు తీసుకొని మూడో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లో తనూజ, పవన్ కళ్యాణ్ పడాల ఇద్దరు హౌస్ లో ఉండగా నాగార్జున హౌస్ లోకి గోల్డెన్ సూట్ కేస్ తో వెళ్తాడు. వారిద్దరికి ఇరవై లక్షలు ఆఫర్ ఇవ్వగా ఎవరూ తీసుకోరు. ఇక చేసేమీ లేక వాళ్ళిద్దరిని నాగార్జున స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. కౌంట్ డౌన్‌స్టార్ట్ చేసి విన్నర్ కళ్యాణ్ అని అతని చేతిని పైకి లేపుతాడు. ఇక హౌస్ మేట్స్ అంతా క్లాప్స్ తో అభినందిస్తారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.