English | Telugu

Bigg Boss 9 Nominations: పదమూడో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్‌బాస్ సీజన్-9 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ల ప్రక్రియ యమజోరుగా సాగింది. పదమూడవ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్ మధ్య హీటింగ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లిస్ట్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. కళ్యాణ్‌ కెప్టన్ కాబట్టి ఇమ్యూనిటీ ఉంది. అతను తప్ప నామినేషన్ లో ఎవరున్నారో ఓసారి చూసేద్దాం.

గ్రాండ్ ఫినాలేకి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. పన్నెండవ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వగా.. పదమూడవ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక నుంచి మీరు ఆడే ఆట, మాట్లాడే మాట, మిమ్మల్ని ఫైనల్‌కి చేరువకావాలా.. లేదంటే వెనుతిరగాలా అన్నది నిర్ణయించబోతున్నాయంటూ నామినేషన్స్ రూల్స్ చెప్పాడు. షుగర్ తో చేసిన సీసాను నామినేషన్ చేయాలనుకున్న కంటెస్టెంట్ తలమీద కొట్టి తగిన కారణాలు చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. ‌ఇక నామినేషన్ ప్రక్రియని ఇమ్మాన్యుయల్ స్టార్ట్ చేశాడు. డీమాన్ పవన్, రీతూలని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేశాడు.

సంజనని భరణి నామినేట్ చేశాడు. తన‌ ట్యాబ్లెట్లు దాచేసి ఫన్ క్రియేట్ చేద్దామని సంజన అనుకుందని అది తనకి నచ్చలేదని భరణి కారణం చెప్పి తనని నామినేట్ చేశాడు. ఆ తర్వాత డీమాన్ పవన్ ని భరణి నామినేట్ చేశాడు. ఇక సంజన, రీతూ ఇద్దరు ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. ఇమ్మాన్యుయల్, తనూజ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, తనూజ, సంజన, రీతూ చౌదరి ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ పడాల తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.