English | Telugu

బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ గా యష్మీ!

బిగ్ బాస్ మొదలై రెండు వారాలవుతుంది. కానీ ఇప్పటికి హౌస్ లోని వాళ్ళలో పలానా వీళ్ళు ఫేవరెట్ అన్న ఫీలింగ్ కి ఇంకా జనాలు రావట్లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో మొదటి వారం బేబక్కకి బై చెప్పేయడంతో ఇప్పుడు పదమూడు మంది ఉన్నారు.

ప్రతి సీజన్ లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక గ్రూప్ అయితే మొదలైంది. వాళ్లే యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వి, అభయ్. వీళ్ళంతా షోకీ ముందు నుండే పరిచయం కాబట్టి హౌస్ లో కూడా అలాగే ఉంటున్నారు. యష్మీ చీఫ్ అయి చాల చీప్ గా బెహేవ్ చేస్తుంది. ఎక్కువ స్క్రీన్ స్పేస్ కి ట్రై చేస్తుంది. టాస్క్ లో విన్ అవ్వడం బిగ్ బాస్ పవర్ ఇవ్వడంతో అప్పోజిట్ టీమ్ కి చుక్కలు చూపించింది. వాళ్లు బాధపడుతుంటే యష్మీ, ప్రేరణలు పార్టీ చేసుకుంటున్నారు. తనకి నచ్చిన వాళ్ళు గెలిస్తే చాలు మిగతా వాళ్ళ ఫీలింగ్ తో సంబంధం లేకుండా బెహేవ్ చేస్తుంది. మొన్న జరిగిన సాక్స్ ప్రొటెక్షన్ టాస్క్ లో నబిల్, విష్ణుప్రియ అవుట్ అవ్వడంతో యష్మీ పిచ్చి పిచ్చిగా ఎగురుతూ, గెంతుతూ పృథ్వీతో కలిసి తీన్ మార్ డ్యాన్స్ కనిపించింది. ఇక్కడ యష్మీ, పృథ్వీలని చూసిన వారందరికి "ఏం సైకో గాళ్ళు ఉన్నార్రా" అనేంతలా అనిపించింది.

ఇక యష్మీ ని చూసిన ట్రోలర్స్.. ఆ జేజమ్మే మళ్ళీ బిగ్ బాస్ కి వచ్చింది రా అని యష్మీ స్థానంలో శోభాశెట్టి ముఖాన్ని పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు.‌ సీజన్ సెవెన్ లో శోభాశెట్టికి ఎంత నెగెటివ్ వచ్చిందో రెండు వారాలకే యష్మీకి అంతటి నెగెటివ్ వచ్చింది. ఇక ఈ వారం నామినేషన్ లో లేదు కాబట్టి సేఫ్ అయింది. ఒక్కసారి నామినేషన్ కి వస్తే ఎలిమినేషన్ చేసేదాకా వదలిపెట్టమని నెటిజన్లు భావిస్తున్నారు.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.