English | Telugu

Ticket to Finale: సెకెంఢ్ కంటెండర్ గా అవినాష్.. షాక్ లో కన్నడ బ్యాచ్!

బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ ఆటతీరు రోజు రోజుకి పెరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కన్నడ బ్యాచ్ గ్రూపిజానికి చెక్ వేస్తూ మొన్న రోహిణి, నిన్న అవినాష్ గుణపాఠం చెప్పారు. వీళ్లు కమెడియన్స్.. ఏదో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికిరారు. ముఖ్యంగా ఫిజికల్‌ గేమ్‌లలో అస్సలు ఆడలేరు. ఏదో అదృష్టం కలిసి వచ్చి హౌస్‌లో ఉంటున్నారు తప్పితే.. టోటల్‌గా వీళ్లు జీరో.. ఇవీ అవినాష్, రోహిణి, తేజాలను ఉద్దేశించి కన్నడ అండ్ కో బ్యాచ్‌లోని పృథ్వీ అన్నాడు. అయితే జీరో అన్న నోటితోనే హీరో అనిపించుకుని.. పృథ్వీ అహంకారాన్ని తన విజయంతోనే సమాధి చేసింది రోహిణి. బిగ్ బాస్ హౌస్‌కి చివరి మెగా చీఫ్ కావడమే కాకుండా.. వరుసగా రెండు టాస్క్‌లలో గెలిచి టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో సెకెంఢ్ కంటెండర్ గా అవినాష్ నిలిచాడు. నబీల్, పృథ్వీ, ప్రేరణ లాంటి గేమర్స్ మీద అవినాష్ గెలిచి కామెడీన్ కాదు గేమర్ అని నిరూపించుకున్నాడు. మానస్, ప్రియాంక జైన్ హౌస్ లోకి వచ్చి గేమ్ ఆడించాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో ఫస్ట్ డే ఆడిన వారు కాకుండా మిగిలినవారిలో పృథ్వీ, నబీల్, ప్రేరణ, అవినాష్ లతో మొదటి గేమ్ ' సుడోకు నెంబర్' గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ గెలిచాడు. ఆ తర్వాత సెకెండ్ టాస్క్ ' బోర్డ్ క్రికెట్ '. ఇందులో కూడా అవినాష్ గెలిచాడు. మొదట నబీల్ ఆడగా.. నాలుగు సిక్స్ లతో ఇరవై నాలుగు పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రేరణ, పృథ్వీ ముప్పై పరుగులు చేశాడు. ఇక వారి తర్వాత వచ్చిన అవినాష్ నలభై మూడు పరుగులు చేసి విజయం సాధించాడు.

అవినాష్ ఈ గెలుపుతో కన్నడ బ్యాచ్ కి షాకిచ్చాడు. వారితో పాటే ఉన్న నబీల్ కి ఇది ఒక గుణపాఠంలా తీసుకొని ఇండివిడ్యువల్ గా ఆడతాడా లేదా చూడాలి. ఎంటర్‌టైనర్ అని అనుకున్న అవినాష్ హౌస్ లో ఉన్న మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ కి తన గెలుపుతో సమాధానమిచ్చాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.