English | Telugu

లాస్య-మంజునాథ్ ని అయోధ్యకు పంపిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఎప్పుడూ చేయని ఒక ప్రయోగం చేశారు. అదేంటంటే శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని ఇష్మార్ట్ జోడీస్ ని ఈ షోకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా వీళ్లకు కొన్ని టాస్కులు కూడా ఇచ్చారు. ఆ తసుకుల్లో గెలిచిన జంటతో శ్రీరామనవమి పూజా కార్యక్రమం చేయించారు. అలాగే ఇంకో స్పెషల్ సర్ప్రైజ్ గా గెలిచిన జంటను అయోధ్యకి కూడా పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చినట్టే ఒక జంటను కూడా పంపించారు. ఆ పోటీలు ఏంటంటే నేల మీద ఒక పట్టా వేసి భార్య భర్తను నిలబెట్టి డాన్స్ చేయించడం, తర్వాత భోజనం... ఎవరు అన్నీ ఖాళీ చేస్తారో అని కాన్సెప్ట్, తర్వాత గురి చూసి బాణం వేసే టాస్క్ ఇలా రక రకాల టాస్కులు ఇచ్చింది. ఐతే ఫైనల్ గా ఇదంతా కాదు అని ఆ జోడీలు పేర్లు కాగితాల మీద రాసి మడతేసి టేబుల్ మీద పొసే సీనియర్ నటుడు ప్రదీప్ - సరస్వతి చేత తీయించింది. ఎవరి పేర్లు వస్తాయో వాళ్ళు అవుట్ అంటూ కొత్త పేర్లు చెప్పింది. ఇక ఫైనల్ గా రాకేష్ - సుజాత, లాస్య - మంజునాథ్ మాత్రమే ఉన్నారు. ఇందులో ఫైనల్ లాస్య - మంజునాథ్ పేర్లు రాలేదు. దాంతో వాళ్ళు గెలిచినట్టు అనౌన్స్ చేసింది శ్రీముఖి. వాళ్ళు అయోధ్య వెళ్తారంటూ చెప్పేసరికి లాస్య కన్నీళ్లు పెట్టేసుకుంది. తర్వాత శ్రీముఖి ఇలా చెప్పింది "అసలు ఇష్మార్ట్ జోడికి నేను ఎందుకు వచ్చా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీగా ఎందుకు వచ్చా..నేను ఎప్పుడొచ్చినా లక్ ఎందుకు రాదు..లక్ నా దగ్గర ఎందుకు లేదు. లక్ అదీ ఇది అవసరం లేదు... శ్రీరాముడి అనుగ్రహం మీ మీద ఉంది" అని చెప్పింది శ్రీముఖి. "ఇష్మార్ట్ జోడిలో అన్ని పోటీల్లో ఓడిపోయాను. బయట ఎవరేం మాట్లాడుకుంటారో తెలీదు కానీ మా జున్ను మాత్రం ఇంత చిన్న పోటీ కూడా గెలవలేకపోయావా" అని అడిగాడు అంటూ లాస్య ఏడ్చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.