English | Telugu

ధూమ్ ధామ్‌గా జీ ఫ్యామిలీ కిర్రాక్ పార్టీ!

జీ కుటుంబం అవార్డ్స్ 2022 కిర్రాక్ పార్టీ ధూమ్ ధామ్ గా జ‌రిగింది.దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కి బుల్లితెర సీరియల్స్ లో నటించేవాళ్లంతా వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. స్పెషల్ గెస్ట్ గా పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్స్ గా సుడిగాలి సుధీర్ , శ్రీముఖి రచ్చ రచ్చ చేశారు. సుధీర్ ని చాలా రోజుల తర్వాత ఈ షోలో చూసేసరికి ఫాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు "బతుకు జట్కాబండి" ఎంత ఫేమస్ షోనో అందరికీ తెలుసు ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో "ఉతుకు జట్కాబండి" అని పెట్టి అత్తాకోడళ్ల గొడవలకు పరిష్కారం చూపించేలా తన మాటలతో, కౌంటర్లు తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు పోసాని.

ఇక సీరియల్స్ వచ్చే కొన్ని ఫన్నీ బిట్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ల్స్, మీమ్స్ తో ఎలా ఆడుకుంటున్నారో కొన్ని ప్లే చేసి చూపించారు. తర్వాత ఆనంది "దమ్మారో దమ్" అనే పాటకు బ్లాక్ డ్రెస్ లో వచ్చి అద్దిరిపోయే డాన్స్ చేసి స్టేజిని ఇరగొట్టేసింది. ఈమె డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. తర్వాత సుడిగాలి సుధీర్ వచ్చి తన కోసం ఒక పాట పాడమని ఆనందిని అడిగేసరికి "కమ్మని ఈ ప్రేమలేఖలు" అంటూ పాడింది.

ఇక తర్వాత సీరియల్స్హీరోస్ తో సుధీర్ టీ పెట్టే పోటీ పెట్టి ఎంటర్టైన్ చేసాడు. ఫైనల్ గా యశస్వి, ప్రణవ్ వచ్చి ఊపున్న పాటలు పాడి అందరూ ఊగిపోయేలా చేశారు. అదే టైములో శ్రీముఖి వచ్చి "బంగారం నీకెవరూ లేరా" అని యశస్విని అడిగేసరికి "నువ్వున్నావ్ కదా బంగారం" అని కౌంటర్ వేసాడు. ఇలా ఈ ఈవెంట్ అందరినీ అలరించడానికి ఈ ఆదివారం రాత్రి 6 గంటలకు జీ తెలుగులో రాబోతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.