English | Telugu

న‌య‌ని ఏం చేయ‌బోతోందో తిలోత్త‌మ తెలుసుకుందా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. బెంగాలీ సీరియ‌ల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అషికా గోపాల్, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌చ నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.

తిలోత్త‌మ ఇంట్లో వున్న అద్దం తీసుకొచ్చాక న‌య‌ని గాయ‌త్రీ దేవి చిత్ర ప‌టాన్ని క్లిన్ చేస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో న‌న్ను మ‌ర్చి పోయావా న‌య‌ని అంటూ గాయ‌త్రీ దేవి ఆత్మ వ‌స్తుంది. పౌర్ణ‌మి రోజు మా నాన్న గారు గీసిన బొమ్మ‌లో వున్న‌ట్టుగా చేయాల‌ని చెప్పాను క‌దా? అని న‌య‌నితో అంటుంది. వెంట‌నే న‌య‌ని ఆ ఏర్పాట్లు మొద‌లు పెడుతుంది. పౌర్ణ‌మి రోజు చ‌న్నీళ్ల‌తో త‌ను స్నానం చేసి విశాల్ కు కూడా స్నానం చేయించి పూజ‌కు సిద్ధ‌మ‌వుతుంది.

కట్ చేస్తే.. తిలోత్త‌మ ఇంట్లో న‌య‌ని చెల్లెలు సుమ‌న ప‌ల్లెం, చెంబు ప‌ట్టుకుని హాలు లోకి వ‌స్తుంది. అది చూసిన విక్రాంత్ ఏంటిది? ఏం చేస్తున్నావ్ అంటూ అడుగుతాడు. ఉప‌వాసం వున్నానండీ అని చెబుతుంది సుమ‌న‌. క‌ట్ చేస్తే .. నాగ‌లికి న‌య‌ని, విశాల్ పూజ చేయాల‌ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ విష‌యాన్ని వెట‌కారంగా తిలోత్త‌మ,క‌సిల‌కు చెబుతాడు వ‌ల్ల‌భ‌. ఏమీ లేని విశాల్ ఈ ప్ర‌పంచాన్ని దున్న‌డానికి నాగ‌లిని తెప్పించాడ‌ట అని ఠ‌క్కున్న చెప్పేస్తాడు. దీంతో న‌య‌ని ఏదో చేయ‌బోతోంది. మ‌నం ఇక్క‌డ కూర్చుని చ‌ర్చించుకోవ‌డం కాదు అక్క‌డికి వెళ్లి వాళ్లు ఏం చేస్తున్నారో గ‌మ‌నించాల‌ని విశాల్ వుండే చోటుకి వెళ‌తారు. వ‌చ్చిన వారిపై ఆవు పంచ‌కం( గో మూత్రం) ని చ‌ల్లుతుంది. అదేంటో తెలియ‌క అంతా చిరాకు ప‌డ‌తారు. ఆ త‌రువాత న‌య‌ని, విశాల్ నాగ‌లితో ఆ ప్రాంతాన్ని దున్నేస్తారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.