English | Telugu

మాళ‌విక - అభిమ‌న్యుల‌కు షాకిచ్చిన య‌ష్ - వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌చ డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, మిన్ను నైనిక‌,ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఈ సీరియ‌ల్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. మాళ‌విక కుట్ర‌ని తెలుసుకోని వేద త‌ను చెప్పిన మాట‌లు వినిపి య‌ష్ తో పెళ్లికి నిరాక‌రిస్తుంది. కూతురు మాత్ర‌మే ఉంద‌ని, కొడుకు లేడ‌ని త‌న‌ని న‌మ్మించి మోసం చేశారంటూ య‌ష్ కుటుంబంపై మండిప‌డుతుంది.

Also Read:ప్రభాస్ లాంటి హీరోని చూడలేదు!

అక్క‌డికి నుంచి లోనికి వెళ్లిపోయిన వేద‌ని వెతుక్కుంటూ అక్క‌డికి చేరుకున్న ఖుషీ.. త‌న త‌ల్లి మాళ‌విక ప‌న్నిన కుట్ర‌ని వేద‌కు తెలియ‌జేస్తుంది. త‌న తండ్రి మంచి వాడ‌ని, అత‌నికి ఎలాంటి కుట్ర‌లు తెలియ‌వ‌ని, త‌న‌కు నువ్వు కావాల‌ని, డాడీ, నువ్వు, నేను ముగ్గురం క‌లిసి వుందామ‌ని చెబుతుంది. దీంతో క‌న్విన్స్ అయిన వేద త‌న‌ని విడిచి వెళ్లిపోతున్న ఖుషీని అక్కున్న చేర్చుకుని పెళ్లికి అంగీక‌రిస్తుంది. ఇరు కుటుంబాలు ఆనందాన్ని వ్య‌క్తం చేసి య‌ష్, వేద‌ల పెళ్లి చేస్తారు.

పెళ్లి త‌రువాత ఊరేగింపుగా వెళుతుంటే య‌ష్, వేద‌ల మ‌ధ్య‌లో నిలుచుని ఖుషీ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వుంటుంది. అది చూసి య‌ష్, వేదలు మురిసిపోతూ వుంటారు. త‌ను కోరుకున్న‌ట్టుగానే య‌ష్, వేద‌ల వివాహం జ‌ర‌గ‌డంతో ఖుషీ ఆ ఆనందంతో మురిసిపోతుంది. ఇద్ద‌రి ప‌ట్టుకుని ఫొటోల‌కు పోజులిస్తుంది. అయితే జ‌ర‌గ‌దు అనుకున్న య‌ష్, వేద‌ల పెళ్లి జ‌రిగిపోవ‌డంతో మాళ‌విక - అభిమ‌న్యు ఏం చేశారు? .. ఎలాంటి కుట్ర‌కు తెర తీశారు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.