English | Telugu

య‌ష్‌..వేద క‌ర్టెన్ లో రొమాన్స్‌..

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీనియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, ఆనంద్, వ‌ర‌ద‌రాజులు, సులోచ‌న‌, మిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. వేద‌కు, య‌ష్ కు మ‌ధ్య వున్న దూరంగా తొలగించి వారికి ద‌గ్గ‌ర‌చేయాల‌ని ఖుషీ ప్లాన్ చేస్తుంది. బాబాయ్ వ‌సంత్ తో క‌లిసి తాత‌య్య‌, నానమ్మ‌, కాంచ‌ల‌ని బ‌ట‌యికి తీసుకెళ్లాల‌ని, త‌ద్వారా య‌ష్ , వేద‌ల‌కు ప్రైవ‌సీ ల‌భిస్తుంద‌ని ప్లాన్ చేస్తుంది ఖుషీ.

అనుకున్న‌ట్టుగానే అంద‌రిని వ‌సంత్ స‌హాయంతో బ‌య‌టికి తీసుకెళుతుంది. అదే స‌మ‌యంలో ఇంట్లో య‌ష్ , వేద వుండ‌గానే బ‌య‌ట తాళం వేయిస్తుంది. దీంతో ఇద్ద‌రు ఇంట్లోనే బందీ అయిపోతారు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణలు.. ఒక‌రికి గురించి ఒకరు తెలుసుకుంటారు. అదే క్ర‌మంలో ఇంట్లోకి దూరి దొంగ కార‌ణంగా మ‌రింత కామెడీ పుడుతుంది. ఇదిలా వుంటే వేద కర్టెన్ లు సర్దుతూ లాగ‌డంతో అవి మొత్తం వేద‌పై ప‌డ‌బోతుంటాయి. ఇది గ‌మ‌నించిన య‌ష్ వెంట‌నే వ‌చ్చి వేద‌ని ప‌క్క‌కు లాగేస్తాడు.

ఈ క్ర‌మంలో వేద‌, య‌ష్ క‌ర్టెన్ ల‌లో చిక్కుకుని కింద‌ప‌డిపోతారు. ఇద్ద‌రికి క‌ర్టెన్ లు చుట్టేసుకుని కింద‌ప‌డివుంటారు. ఇద్ద‌రు ఒక‌రిని ఒక‌రు చూసుకుంటూ వుండ‌గా అదే స‌మంలో బ‌య‌టికి వెళ్లిన మాళిని, ర‌త్నం, కాంచ‌న ఇంటికి చేరుకుంటారు. క‌ర్టెన్ ల మ‌ధ్య‌లో చుట్టుకుని వున్న య‌ష్ , వేద‌ల‌ని చూసి షాక్ అవుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మాళిని ఎలా రియాక్ట్ అయింది?...అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.