English | Telugu

బాలయ్యా.. నేను నీకంటే రొమాంటిక్ అయ్యా!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మిగతా టాక్ షోలకు భిన్నంగా ఫుల్ జోష్ తో బాలయ్య షో నడిపించిన తీరుతో సీజన్-1 పెద్ద హిట్ అయింది. అందుకే సీజన్-2 పై ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పైగా మొదటి ఎపిసోడ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడం అదనపు ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

'అన్ స్టాపబుల్' సీజన్-2 మొదటి ఎపిసోడ్ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది. "మీకు బాబు గారు.. నాకు బావ గారు" అంటూ చంద్రబాబుకి బాలయ్య ఆహ్వానం పలికారు. "నేను స్టూడెంట్ గా ఉన్న టైంలో.. మీరు సినిమాల్లో చేసిన దానికంటే రొమాంటిక్ గా ఉండేవాడిని" అంటూ చంద్రబాబు బాలయ్యతో కలిసి నవ్వులు పూయించారు. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డితో స్నేహం' దగ్గర నుంచి 'టీడీపీ 1995 సంక్షోభం' వరకు పలు ఆసక్తికర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అలాగే ఈ ఎపిసోడ్ లో నారా లోకేష్ కూడా పాల్గొనడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లోకేష్ ఫోటోని చూపించి బాలయ్య ప్రశ్న అడగటం ఆకట్టుకుంది. ఇలా కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త ఎమోషన్ తో ప్రోమో ఆద్యంతరం ఆసక్తికరంగా సాగింది.

'అన్ స్టాపబుల్' సీజన్-2 మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14న ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోతో రెండో సీజన్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.