English | Telugu

మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్, సుహాసిని, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వచ్చారు. ఇక ఈ ప్రోమో మొత్తం జోక్స్ తో నిండిపోయింది. రాగానే అందరికీ కొబ్బరి మామిడి ముక్కలు ఇచ్చింది సుమ. ఆ తర్వాత ఇందులో సుహాసినిని హైలైట్ చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకోమని అడిగింది సుమా. "నాకు మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు..ఇది తగిలించి పులుసు వేసుకుని తింటే ఉంటాది నా సామి" అంది. దాంతో సుమ అంది చేపలు తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఎప్పుడూ అని అంది. అదేంటో అర్ధం కాక ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది సుహాసిని. "చేపలు పొట్టలోపలికి వెళ్లి గలుగులు చేస్తాయి" అంది. దాంతో నవ్వేసింది సుహాసిని. ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడిగింది "చంటిగాడు సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నా కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవకపోవడానికి కారణం ఏంటి" అని అడిగింది. "సక్సెస్ వచ్చింది. అది హ్యాపీ థింగ్.

మరీ కాకపొతే ఆ ఏజ్ లో కాకుండా కొంచెం 20 స్ లో వచ్చి ఉండి ఉంటే బాగుండేది అని ఫీలింగ్ ఉంది" అంది సుహాసిని. "అయ్యో మీరు ఇప్పుడే 20 స్ లో ఉన్నట్టుగా ఉన్నారు" అని సుమా రివర్స్ కౌంటర్ వేసేసరికి సుహాసిని అది నిజమే అనుకోండి అనబోతున్నంతలో "సరదాగా జోక్ చేసాను లెండి" అంటూ సుహాసిని పరువు మొత్తం తీసేసింది". తర్వాత సుమ ప్రియాంక చేత కాఫీ, టీ ఎలా అమ్మాలో చేసి చూపించాలంటూ" టాస్క్ ఇచ్చింది. లాస్ట్ లో సుహాసినికి కూరగాయలు అమ్మే టాస్క్ ఇచ్చింది. ఐతే సుహాసిని ముందు స్టైల్ గా కూరగాయలు అమ్మింది కానీ ఆ తర్వాత మాస్ మసాలా రేంజ్ లో కూరలు అమ్మేసరికి ఇది అసలు రూపం అంటూ అంబటి అర్జున్ సుహాసిని గురించి కామెంట్ చేసాడు. సుహాసిని చంటిగాడు, సుందరానికి తొందరెక్కువ లాంటి మూవీస్ లో నటించింది. ఇంకొన్ని మూవీస్ లో సహాయక పాత్రల్లో నటించింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.