English | Telugu

బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో సోనియా...ఈ వారం డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే నాలుగు వారాలు ముగిసాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వందలో తొంభై శాతం మంది జనాలు సోనియా ఎలిమినేషన్ అవ్వాలనే కోరుకుంటున్నారు.

అయితే సోనియాని ఎలిమినేషన్ చేయకుండా సీక్రెట్ రూమ్ లో పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సోనియా సీక్రెట్ రూమ్ కి వెళ్తే హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ తన గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకుంటుంది. కచ్చితంగా హౌస్ మేట్స్ కి తనకి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. దాంతో తను నిఖిల్, పృథ్వీలతో ఉండకుండా హౌస్ లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఓటింగ్ ముగిసే సమయానికి పృథ్వీ, సోనియా లీస్ట్ లో ఉండగా వారిపైన ఆదిత్య ఓం ఉన్నాడు. అయితే బిగ్ బాస్ పృథ్వీని ఎలిమినేట్ చేస్తే సోనియాని సీక్రెట్ రూమ్ కి పంపిస్తాడు. అయితే ఓటింగ్ లో నబీల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రేరణ సెకెండ్ పొజిషన్ లో ఉంది‌.

నబీల్ కు బయట ఫాలోయింగ్ కూడా పెరిగింది. మరో ట్విస్ట్ కూడా ఉంటుందని.. నాగ మణికంఠని బయపెట్టడానికి, ఆటతీరు, మాటతీరు ఇంప్రూవ్ చేసుకుంటాడని.. అతడిని సీక్రెట్ రూమ్ కి పంపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి‌. ఎలిమినేషన్ అయ్యేవారెవరనేది మాత్రం మరికొన్ని గంటల్లో లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అని మరికొందరు అంటున్నారు. ఇదే జరిగితే హౌస్ మేట్స్ కి పెద్ద షాక్ అవుతుంది‌. ఇక శనివారం నాటి ప్రోమో కోసం ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. సోనియా ఎలిమినేషనా లేక సీక్రెట్ రూమా అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.