English | Telugu

గుడిలో ఆదిత్య‌కు షాకిచ్చిన రుక్మిణి, స‌త్య‌

వెండితెర‌పై `చంటిగాడు` సినిమాతో ఆక‌ట్టుకున్న సుహాసిని ఆ త‌రువాత వెండితెర‌ను వీడి బుల్లితెర‌కు షిఫ్ట్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సీరియ‌ల్ `దేవ‌త‌`. అర్జున్ అంబ‌టి, వైష్ణ‌వీ రామిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తోంది. ప్రారంభం నుంచి ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతున్న `దేవ‌త‌` సీరియ‌ల్ నేడు స‌రికొత్త ట్విస్ట్‌ల‌తో సాగ‌బోతోంది.

ఈ మంగ‌ళ‌వారం 402వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. దీని హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. కార్తీక పౌర్ణ‌మి కార‌ణంగా దీపాలు వెలిగించ‌డానికి స‌త్య‌, దేవుడ‌మ్మ సిద్ధ‌మ‌వుతారు. అదే స‌మ‌యంలో రాధ (రుక్మిణి), జాన‌కి, పిల్ల‌లు గుడికి వెల్ల‌డానికి రెడీ అవుతుంటారు. ఇంత‌లో రామ్మూర్తి ఫోన్‌కి ఏదో మెసేజ్ వ‌స్తుంది. ర‌మ్య ఆఫోన్‌ని తీసుకొచ్చి ఏదో మెసేజ్ వ‌చ్చిన‌ట్టుంది చూడు బావా అంటూ మాధ‌వ‌కి ఇస్తుంది. అందులో బుల్లెట్‌పై ఆదిత్య పిల్ల‌ల‌ని తీసుకెళుతూ దిగిన ఫొటోలు క‌నిపిస్తారు. దాంతో మాధ‌వ మూడ్ అప్‌సెట్ అవుతుంది. ఆ ఫొటోల‌ని జాన‌కి, రాధ‌ల‌కు చూపించి `ఆదిత్య పిల్ల‌ల‌తో దిగిన ఫొటోలు చూస్తుంటే నా అవిటిత‌నాన్ని వెక్కిస్తున్న‌ట్టుగా వున్నాయ‌ని` మాధ‌వ మ‌న‌స్తాపానికి గురై అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

క‌ట్ చేస్తే జాన‌కి, పిల్ల‌ల‌తో క‌లిసి గుడికి వెళ్లిన రాధ (రుక్మిణి) స‌త్య‌కు క‌నిపిస్తుంది. రుక్మిణిని చూసిన స‌త్య షాక్‌కు గుర‌వుతుంది. అదే స‌మ‌యంలో రుక్మిణిని జానికి రాధ అని పిల‌వ‌డంతో మ‌రింత షాక్‌కు గుర‌వుతుంది. ఇక స‌త్య‌ని గ‌మ‌నించిన రాధ త‌ను క‌నిపించ‌కుండా జాగ్ర‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తుంది. స‌త్య‌కు రాధే రుక్మిణి అని తెలిసిపోయిందా? .. తెలిస్తే స‌త్య ఏం చేసింది? ... క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.