English | Telugu

బీబీ రాజ్యం టాస్క్ లో రాయల్స్ గెలుపు.. ఓజీకి పరిణామం ఏంటంటే!


బిగ్ బాస్ సీజన్-8 లో మొన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.‌ ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్ లో ఉన్నారు. ఇక అవినాష్ జిమ్ ట్రైనర్ గా చేసి నవ్వించాడు. దాంతో హౌస్ లో కిచెన్ లోని టైమ్ రెండు గంటలు పెరివింది. దాంతో పాటు హౌస్ లోకి అతి ముఖ్యమైన కూరగాయలు, పండ్లు పంపించాడు‌ బిగ్ బాస్.

ఇక హౌస్ లో టాస్క్ లో పరంపర మొదలెట్టాడు బిగ్ బాస్. టాస్క్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే... ఒక రాజ్యాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదు.. అలా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన వనరులని, సంస్థలని మీరు సమకూర్చుకోవాలి. సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల తర్వాత బీబీ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి మీరు పోటీ పడతారు.. ఎవరైతే రాజ్యాన్ని నిర్మిస్తారో వాళ్లకి ప్రయోజనం.. విఫలమైన క్లాన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాలంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు

మొదటి టాస్క్ ని మొదలెట్టాడు బిగ్‌బాస్. నీరు చాలా ముఖ్యమైన వనరు.. రాజ్యం బావుండాలంటే నీటి సదుపాయం చాలా అవసరం.. తాగడానికి నీళ్లు లేకపోతే అది థూళితో సమానం.. కాబట్టి అలాంటి నీటినిచ్చే సరస్సును పొందడానికి ఇచ్చే టాస్కు.. 'నీరు, మీరు.. మధ్యలో అక్వైరియం'. ఈ టాస్కులో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా.. కళ్లకి గంతలు కట్టుకొని మీకు సంబంధించిన అక్వైరియంలో నీళ్లు పోయాలి.. బజర్ మోగే సమయానికి ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్లే విజేతలు.. గెలిచినవాళ్లు సరస్సుపై మీ జెండాను పాతొచ్చంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్కులో రాయల్స్ క్లాన్ గెలిచింది.
ఇక టాస్కులో గెలిచిన రాయల్స్ క్లాన్‌కి ఓ ప్రయోజనం ఉందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. మీలో ఒకరికి నేరుగా మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం.. అది ఎవరో మీరే నిర్ణయించుకొని అడిగినప్పుడు చెప్పండి అంటూ బిగ్‌బాస్ అన్నాడు. మరోవైపు ఓడిపోయినందుకు ఓజీ క్లాన్ మీ నుంచి ఒకరిని మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించాలి.. అది నిర్ణయించి బిగ్‌బాస్ అడిగినప్పుడు చెప్పండి.. అంటూ చెప్పాడు. కంటెండర్ రేస్ నుండి యష్మీ తప్పుకుంది. రాయల్ క్లాన్ నుండి రోహిణి డైరెక్ట్ గా మెగా ఛీఫ్ కోసం ఎన్నికైంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.