English | Telugu

వైజాగ్ లో రచ్చ చేసిన రౌడీ రోహిణి టీమ్


జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫేమస్ కమెడియన్స్ ఐన రోహిణి, పవిత్ర, నరేష్, శాంతిస్వరూప్ అంతా కలిసి వైజాగ్ లో జరిగిన ఒక ఈవెంట్ కి వెళ్లి అటునుంచి అటు బీచ్ కి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. లంచ్ కి డికబాన రెస్టారెంట్ కి వెళ్లి అక్కడి వ్యూని బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నారు. ఈ రెస్టారెంట్ మొత్తాన్ని వీడియో తీసి రోహిణి తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది.

తర్వాత కైలాసగిరి రోప్ వేకి వెళ్లారంతా. ఐతే ఇక్కడ అందరికీ ఫుల్ టికెట్ ఉంటుంది కానీ నరేష్ కి హాఫ్ టికెట్టే అంటూ రోహిణి పంచ్ వేసి అందరిని నవ్వించింది. తర్వాత రోప్ వే లో వెళ్లి సరదాగా ఎంజాయ్ చేసింది టీమ్. తర్వాత కౌబాయ్ క్యాప్స్ పెట్టుకుని సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. ఇంతలో "మీరు రోహిణి గారు కదూ" అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళు అడిగేసరికి అక్కడి నుంచి కైలాస్ హిల్ కి వచ్చేసింది టీమ్. రిటర్న్ లో రోప్ వే బాక్స్ లో వస్తుండగా ఈ బాక్స్ లో ఏసీ లేదా అంటూ పవిత్ర అడిగేసరికి అంతా ఒక్కసారిగా ఆమె వైపు ఒక ఫన్నీ లుక్ ఇస్తారు. తర్వాత అందరూ ఐస్ క్రీమ్స్ తినేసి బీచ్ కి వెళ్లిపోయారు రోహిణి అండ్ టీమ్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.