English | Telugu

హమ్మయ్యా దేవుడా థ్యాంక్యూ..వీసా వచ్చింది.. శివ్ తో కలిసి ఇక యూఎస్ వెళ్లొచ్చు


బుల్లితెర మీద ప్రియాంక జైన్, శివ్ గురించి తెలియని వాళ్లుండరు. వీళ్ళు కలిసి సీరియల్స్ లో, షోస్ లో నటిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా ప్రియాంక ఒక వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. యూఎస్ వీసా కోసం ఎంతో ట్రై చేస్తోందని ఫైనల్ గ వీసా వచ్చిందంటూ ఆనందంతో గంతులేసింది. ఐతే వీసా గురించి మూడు ప్రశ్నలు అడిగారు శివ్ తో కలిసి యూఎస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు చెప్తాను అంటూ చెప్పింది. దేవుడికి కూడా థాంక్యూ చెప్పింది ప్రియాంక. ఇక ముంబైలోని బ్యాండ్ స్టాండ్ మీదగా వెళ్తూ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్ళు ఇవే అంటూ కార్ లో వెళ్తూ చూపించింది. ఫ్యూచర్ లో ఇలాంటి ఒక ఇల్లు ఇక్కడ ముంబైలో ఉండాలని అది షారుఖ్ ఖాన్ ఇంటి కంటే పెద్దగా ఉండాలని చెప్తూ "శివ్ ప్లీజ్ నాకు అంత పెద్ద ఇల్లు ఒకటి కావాలి" అంటూ అడిగింది.

ముంబై వచ్చాక అందులోనూ మన్నత్ ప్లేస్ కి వచ్చాక సూపర్ గా అనిపిస్తుంది అని చెప్పింది. ఇక పిన్నితో కలిసి డేట్ కి వెళ్ళింది అలాగే బీచ్ కూడా వెళ్ళింది ప్రియాంక. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వీసా అప్రూవ్ అయ్యింది అని చెప్పింది. తర్వాత ఫుడ్ తినేసి షాపింగ్ చేసింది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ రెలెటివ్స్ ని పిల్లలని చూపించింది. వాళ్ళ అమ్మను చూపించింది. ఆమె పావురాళ్లకు మేత వేస్తూ కనిపించింది. అలాగే వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళింది. ఇక అక్కడ అందరికీ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చేసింది ప్రియాంక జైన్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.