English | Telugu

విష్ణుప్రియ, రీతూ పరువు తీసిన ప్రదీప్!

ఆహా ఓటిటి వేదికపై కొత్త మూవీస్ తో పాటు గేమ్ షోస్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఫేమస్ గేమ్ షో ఐన 'సర్కార్ 2' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ స్టేజి మీదకి నలుగురు తెలివైన వాళ్ళను తీసుకొస్తున్నట్లు చెప్పి వాళ్ళే వీళ్ళు అంటూ దివి, విష్ణుప్రియ, రీతుచౌదరీ, భానుశ్రీని పరిచయం చేశాడు. ఇక ఈ నలుగురు కలిసి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు వచ్చారు. "ఎక్కడైనా నలుగురు కలిసి డాన్స్ చేస్తారు కానీ వీళ్ళ నలుగురు వేరు" అన్నాడు ప్రదీప్. ఆ డైలాగ్ కి విష్ణు పగలబడి నవ్వింది. "మీరేం కంగారు పడకండి, విష్ణు నవ్వు జనరేటర్ శబ్దంలా ఉంటుంది" అని పంచ్ వేశాడు ప్ర‌దీప్‌. ఆ నలుగురితో 'సర్కారు వారి పాట' పాడించాడు.

ఇక ఫైనల్ గా 'జీపీఎస్' అంటే ఫుల్ ఫార్మ్ ఏమిటి అని అడిగాడు ప్ర‌దీప్‌. కానీ ఎవరూ ఆన్సర్ చెప్పలేక హైదరాబాద్ లో ఉన్న క్లబ్బుల పేర్లు చెప్పారు. "సారీ.. నలుగురు తెలివైన వాళ్ళను తెచ్చాను అనుకున్నా కానీ కాదు" అంటూ విష్ణు, రీతూ పరువు తీసేసాడు ప్రదీప్. ఈ మధ్య నిహారిక, నవదీప్, సదా, విశ్వక్ సేన్, సాయి పల్లవి, రానా, అడివి శేష్, శోభిత ఇలా ఎంతో మందితో ఈ గేమ్ షో ఆడించాడు ప్రదీప్. ప్రతీ ఎపిసోడ్ లో ఫోర్ రౌండ్స్ ఉంటాయి. ఫైనల్ రౌండ్ వరకు ఎవరు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్తూ ఆడతారో వాళ్ళు గెలిచినట్టు. ఇక ఈ షోకి బిగ్ స్క్రీన్ నుంచి కూడా చాలా మంది సెలెబ్రిటీస్ వచ్చి ఈ సర్కారు వారి పాటలో పార్టిసిపేట్ చేశారు. మ‌రోవైపు ప్రదీప్ పాపులర్ డాన్స్ షో 'ఢీ 14'కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.