English | Telugu

జ్వాల‌ ముందే హిమ‌కు తాళి క‌ట్టి షాకిచ్చిన నిరుప‌మ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ముందుకు సాగిపోతోంది. ఈ మంగ‌ళ‌వారం ఏం జ‌రిగిందో ఒకసారి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏడు అడుగులు వేయ‌మంటూ జ్వాల‌ అడుగుల కోసం పూల‌తో అలంక‌రిస్తుంది హిమ‌.. మ‌ధ్య‌లో నిరుప‌మ్.. అటు ఇటు హిమ, జ్వాల‌. నిరుపమ్ ద‌గ్గ‌రికి పూల‌పై అడుగులు వేస్తూ వెళుతూ వుంటుంది జ్వాల‌.. ఏడో అడుగు వేసే స‌మ‌యంలో జ్వాలకు ఫోన్ కాల్ వ‌స్తుంది. వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

ఆ ఫోన్ కాల్ చేసింది శోభ‌. జ్వాల ఎవ‌రు అని అడ‌గ్గా, శోభ త‌ను ఎవ‌రో తెలియ‌నీయ‌కుండా రాక్ష‌స న‌వ్వు న‌వ్వి 'ఎలా వున్నావు జ్వాల' అంటుంది. 'నేను హిమని' అని అబ‌ద్ధం చెబుతుంది. అంతే కాకుండా త‌నంటే చిరాకు వ‌చ్చేలా చేస్తుంది. 'నేను అడ్ర‌స్ చెబుతాను నువ్వు రావాలి. లేట్ చేస్తే మ‌న‌సు మార్చుకుంటాను' అని చెప్ప‌డంతో జ్వాల త‌న కోసం ప‌రుగులు తీస్తుంది. ఇదంతా చాటునుంచి గ‌మ‌నిస్తున్న శోభ రాక్ష‌స ఆనందం పొందుతుంది.

"ఏంటి బావా.. జ్వాల ఇలా వెళ్లిపోయింది?" అని హిమ అంటుంటే, "త‌ను ఏడో అడుగు వేసి వుంటే నిన్ను నేను ప్రేమించ‌డం లేదు. ప్రేమించ‌ను కూడా అని జ్వాల‌కు చెప్పే వాడిని" అంటాడు. దీంతో హిమ షాక్ అవుతుంది. "ఏంటిది?" అంటూ సీరియ‌స్ అవుతుంది. క‌ట్ చేస్తే.. హిమ‌ను గుడికి తీసుకొచ్చిన నిరుప‌మ్ అక్క‌డే తాళిక‌డ‌తాడు. మ‌న ఇద్ద‌రినీ విడ‌దీసే హ‌క్కు ఎవ‌రికీ లేదంటూ అస‌లు విష‌యం చెబుతాడు. ఆ సీన్ చూసిన జ్వాల ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.