English | Telugu

రాజువయ్యా..మహరాజువయ్యా..

కొంతమందికి తీసుకునే అలవాటు ఉంటే ఇంకొంతమందికి ఇచ్చే అలవాటు ఉంటుంది. రెండో కోవలోకి వస్తారు మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల అతని కొడుకు రికీ. ఈసారి ఒక స్వచ్చంద కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా నిర్వహించి మళ్ళీ తన అభిమానుల మనసులను దోచుకున్నాడు. హైదరాబాద్ లోని చెంగిచెర్లలో ఉన్న 70 మంది నిరుపేద పిల్లలకు పీజ్జాలు, పుస్తకాలను పంపిణీ చేసాడు. ఆ తర్వాత కాసేపు ఆ ఇద్దరూ కలిసి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ స్కూల్లో చదువు ఎలా చెప్తున్నారు, ఎలా చదువుకుంటున్నారనే విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపమ్, రిక్కీ ఇద్దరూ కలిసి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేశారు. ఇక అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా కార్తీకదీపం గురుంచి ప్రత్యేకంగా ముచ్చట్లు చెప్పారు.

ఇప్పటికీ ఇంకా ఆ సీరియల్ ని ఫాలో అవుతున్నామన్నారు. కార్తీక దీపం సీరియల్ లో మీరిద్దరూ చాలా బాగా నటించారు . ఈసారి మాత్రం తప్పనిసరిగా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ని కూడా తీసుకురావాలి అని మరీ మరీ చెప్పారు. కార్తీక దీపం సీరియల్ నుంచి బయటకి వచ్చేశాక డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటినుంచే ఇవ్వడం అనేది అలవాటు చేస్తే వాళ్లకు కూడా తెలుస్తుంది తనకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి అలాంటి సౌకర్యాలు లేక బయట ఎంతమంది బాధ పడుతున్నారు అనే విషయాలు . అందుకే రిక్కీకి ఇవన్నీ తెలియాలనే తీసుకెళ్ళాను అన్నాడు డాక్టర్ బాబు. ఇక కార్తీక దీపం బుల్లి తెర మీద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. నిరుపమ్ ఇప్పటికే ఎన్నో షోస్ లో కనిపించాడు. చాలా సీరియల్స్ లో నటించాడు. ఈయన భార్య మంజుల కూడా బుల్లితెర నటే. ఇప్పుడు ఈ కార్తీకదీపం సీరియల్ లో కొత్త క్యారెక్టర్స్ గా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ, మానస్ నాగులపల్లి, మనోజ్ కుమార్, సుష్మా కిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక నిరుపమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ఎవరితో అనే విషయాలు ఇప్పటివరకు ఇంకా రెవీల్ చేయలేదు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.