English | Telugu

బాల్స్ కోసం పృథ్వీతో గొడవకి దిగిన నిఖిల్.. చూస్తూ ఉండిపోయిన సోనియా!

కెరటం, అంతులేని వీరులు, అఖండ.. ఏంటివని అనుకోకండి.‌ బిగ్ బాస్ సీజన్-8 లోని మూడు గ్రూప్ ల పేర్లు. హౌస్ లో మూడు టీమ్ లుగా డివైడ్ చేసి వారి మధ్య టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ సీజన్ 8, Day 11 ప్రోమో వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో అంతులేని ప్రైజ్ మనీని గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో మొదటగా పూల్ టాస్క్(Pool Task ) ఇచ్చాడు. ఇక ఇందులో విష్ణుప్రియ మొదట స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది‌. సెకెండ్ మణికంఠ దూకాడు. అయితే అందరు పరుగెత్తుకుంటూ వస్తున్నప్పుడు సోనియా పడిపోయింది. ఇక దానికి సోనియా ఎంత చేసిందో ఫుల్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఇక మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండో గేమ్ కలర్ బాల్స్(colour Balls).. ఇందులో నిఖిల్ , నబీల్, పృథ్వీ పోటీపడ్డారు. ఇక ముగ్గురి మధ్య పోటీ గట్టిగానే జరిగింది కాసేపటికి నబీల్ తాడుని వదిలేసినట్టు తెలుస్తుంది. ఇక పృథ్వీ, నిఖిల్ మధ్య బాల్స్ కోసం గట్టిగానే కుస్తీ జరిగినట్టుంది.

బాల్స్ కోసం పృథ్వీతో నిఖిల్ గొడవ కు దిగగా.. అక్కడే ఉన్న సోనియా అలాగే చూస్తుండిపోయింది. ఎంతలా అంటే తను ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కానీ డైలామాలో ఉంది. ఎందుకంటే ఇద్దరికి తను బాగా క్లోజ్ అయ్యింది. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు హర్ట్ అవుతారు. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ ప్రోమోని చూసేయ్యండి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.