English | Telugu

ఫస్ట్ టైమ్ అమ్మాయి వల్ల ఏడ్చిన నిఖిల్.‌. అసలేం జరిగిందంటే!

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. మెగా చీఫ్ కంటెండర్ అయ్యేందుకు జరుగుతున్న ఈ టాస్క్ లో నాలుగు టీమ్ లుగా విడిపోయారు. హౌస్ లో పానిపట్టు యుద్ధం టాస్క్ జరుగుతుంది. ప్రతీ టీమ్ కి వాళ్ళకి ఇచ్చిన ట్యాంక్ లోని వాటర్ కిందపోకుండా కాపాడుకోవాలి.. ఆపోజిట్ టీమ్ వాళ్ళు వచ్చి ట్యాంక్ లోని వాటర్ తగ్గించే ప్రయత్నం చెయ్యాలి.. అందులో భాగంగా ఇరు టీమ్ ల మధ్య గొడవ జరుగుతుంది.

రెడ్ టీమ్, బ్లూ టీమ్ కి మధ్య గొడవ జరుగుతుంది. టాస్క్ తర్వాత కూడా నిఖిల్ తో యష్మీ మాట్లాడుతుంది. అప్పుడు కూడా ఇరువురు టాస్క్ లో నోరు జారిన మాటల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పృథ్వీతో నిఖిల్ మాట్లాడుతుంటే యష్మీ వచ్చి.. నిఖిల్ ఆడిన తీరు గురించి మాట్లాడుతుంది. దాంతో నిఖిల్ ఎమోషనల్ అవుతాడు.. అది గేమ్ అని యష్మీ అనగానే.. నాది కాదా గేమ్ అని నిఖిల్ అంటాడు.‌ నా టీమ్ కోసం నేను ఆడుతానని యష్మీ అంటుంది. నాకు లేదా టీమ్ అని నిఖిల్ అంటాడు. మీరు అన్న మాటలు నాకు వినిపించాయి.. ప్రేరణ మీరు బ్లడీ అంటున్నారంటూ నిఖిల్ ఏడుస్తాడు. నిఖిల్ ఏడుస్తుంటే యష్మీ టచ్ చేసి ఏడవద్దని చెప్పబోతుంటే.. నిఖిల్ టచ్ కూడా చెయ్యనివ్వడు. ఎన్ని రోజులు హౌస్ లో ఉన్న ఇక ఇలాగే ఉంటాను.. నా గేమ్ నేను ఆడుతానని నిఖిల్ అంటాడు.

ఏదైనా రిలేషన్ ఉంటే బయట చూసుకుంటాను. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇలాగే ఉంటాను. అసలు ఇప్పుడు పంపించినా వెళ్ళాలని ఉందని చెప్పి.. నిఖిల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పృథ్వీకి యష్మీ వివరణ ఇస్తూ.. పృథ్వీ దగ్గర ఏడుస్తుంది. మరుసటి రోజు నుండి నిఖిల్, యష్మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నదెక్కడా కన్పించలేదు. మరి వీళ్ళిద్దరు ఎన్ని రోజులు ఇలా మాట్లాడుకోకుంటారో చూడాలి మరి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.