English | Telugu

Bigg Boss Telugu 9: ప్యాక్ యువర్ బ్యాగ్ డీమాన్.. డోర్స్ ఓపెన్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-9 లో నాగార్జున వచ్చీ రాగానే సంజనకి క్లాస్ తీసుకున్నాడు. మాధురి, భరణిల మధ్య జరిగిన బిర్యానీ గొడవ గురించి డిస్కస్ చేశాడు‌. ఆ తర్వాత దివ్య కెప్టెన్ అయినందున తనకి కంగ్రాట్స్ తెలిపాడు.

ఆ తర్వాత డీమాన్ పవన్ ని లేవమని చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత డోర్లు తెరవండి.. ప్యాక్ యువర్స్ బ్యాగ్ అంటూ డీమాన్ పవన్ కి నాగార్జున చెప్పడంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. రీతూ చౌదరి అయితే కన్నీళ్ళు పెట్టుకుంది. తన తప్ఫేం లేదు సర్ అని ఏడ్చేసింది.

మాధురి గారు నామినేషన్స్ అప్పుడు మీ ఇద్దరిదీ అన్ హెల్దీ బాండ్ అని చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. మీ బాండింగ్‌ని అన్ హెల్దీ అని అనడానికి ఆమెకి ఏం హక్కు ఉందని అనిపించింది. కానీ.. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే.. మీది ఖచ్చితంగా అన్ హెల్దీ బాండింగ్ అనే అనిపిస్తుందని నాగార్జున చెప్పాడు. నో సర్.. నో అని రీతు అన్నది. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది రీతూకి మాత్రమే కాదు.. హౌస్‌లో ఉన్న ఆడియన్స్‌కి.. చూసే ఆడియన్స్‌కి క్షమాపణ చెప్పమని డీమాన్ తో నాగార్జున అన్నాడు.

ఇక మోకాళ్లపై కూర్చున్నాడు డీమాన్.. నేను అలా చేసి ఉండకూడదు. ఫ్యూచర్‌లో రిపీట్ చేయను. మీరు నాకు వేరే ఎలాంటి శిక్ష వేసినా భరిస్తానని డీమాన్ క్షమాపణ చెప్పాడు. ఇదే మాట రీతూ చౌదరికి కూడా చెప్పు అన్నాడు నాగార్జున. దాంతో డీమాన్.. రీతూ చౌదరి కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. ఓ పక్క రీతూ.. లే పవన్ అని అంటున్నా కూడా.. మోకాళ్లపైనే కూర్చుని ఆమె చేతుల్ని పట్టుకుని.. రీతూ.. సారీ.. నిన్ను తోసి ఉండకూడదు.. ఫ్యూచర్‌లో మళ్లీ ఇలా చేయనని మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పాడు డీమాన్.

ఇది లైఫ్ లెస్సన్ పవన్.. నీకోసం హౌస్ మొత్తం స్టాండ్ తీసుకున్నారు.. నీ క్యారెక్టర్‌కి సర్టిఫికేట్ ఇచ్చారు.. నువ్వు కూడా అవతల వాళ్ల క్యారెక్టర్‌పై నింద పడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలంటూ నాగార్జున చెప్పాడు. మరి డీమాన్, రీతూ మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.