English | Telugu

Nabeel journey: నబీల్ జర్నీ వీడియో.. వరంగల్ కా షేర్.. 

బిగ్ బాస్ సీజన్-8 లో గత వారం నుండి విన్నర్ ఎవరా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇక హౌస్ లో ఉన్న అయిదుగురిలో ఒక్కొక్కరికి తమ జర్నీ వీడియోలని అద్భుతంగా ఎడిట్ చేశారు బిగ్ బాస్. మొదటగా గౌతమ్ జర్నీ వీడియో చూపించగా, రెండోది అవినాష్, మూడు నిఖిల్, నాల్గవది ప్రేరణ జర్నీ వీడియో చూపించగా చివరగా నబీల్ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్.

నబీల్ గురించి బిగ్‌బాస్ చెప్పిన మాటలని ఓసారి చూసేద్దాం. నబీల్.. లైక్ షేర్ సబ్‌స్కైబ్ నుంచి లైట్స్ కెమెరా యాక్షన్ వరకూ మీ ప్రయాణాన్ని తీసుకెళ్లాలనే మీ తొమ్మిదేళ్ల తపన మిమ్మల్ని ఈ స్థానంలో నిల్చోబెట్టింది.. వరంగల్ కా షేర్ అనే పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు.. మీ టాలెంట్‌ని మీ వ్యక్తిత్వాన్ని కోట్ల మంది ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ఈ ప్టాట్‌ఫామ్ ద్వారా మీకు వచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం మీరు సద్వినియోగం చేసుకున్నారు. నామినేషన్స్‌లో మీరు చూపించిన ఫైర్ కానీ టాస్కులో మీరు చూపించిన పట్టుదల కానీ మీ పేరును అందరూ అండర్‌లైన్ చేసేలా చేసింది.. మెగా చీఫ్ ప్రామిస్ చేయడంలోనైనా.. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేయడంలోనైనా ఉన్నతంగా ఆలోచించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు..నబీల్.. మీరు సెల్ఫ్ మేడ్.. అందుకే మీకు ఆత్మ గౌరవం కూడా ఎక్కువే.. దాన్ని ప్రశ్నించింది ఎవరైనా వారికి దీటుగా మీ ఆటతో జవాబిచ్చారు.. ఈ ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు.. ప్రయాణం మధ్యలో మీలో ఫైర్ తగ్గిందని మీ తోటివాళ్లు చెప్పినప్పుడు.. మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. అప్పటి నుంచి అందరికీ ఆమోదయోగ్యంగా మారేందుకు మీరు పడిన తపన స్పష్టంగా కనిపించింది..

మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకల మధ్య ఒక సామాన్యుడిగా ఒంటరై నిలిచినట్లు మీకు అనిపించింది.. కానీ నబీల్ అది మీ బలహీనత కాదు అదే మీ బలం.. టాప్-5లో ఒకరిగా నిలిచిన మీ ప్రయాణం చూసి యావత్ ప్రేక్షక లోకమే కాదు ఇప్పుడు బిగ్‌బాస్ కూడా మనస్ఫూర్తిగా అంటున్నారు వెల్ ప్లెయిడ్ నబీల్.. ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఇప్పుడు ఓసారి చూద్దామంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు నబీల్. నోట మాట రావట్లేదని నబీల్ చెప్పాడు.. తన అమ్మ చెప్పిన మాటలని గుర్తుచేసుకున్నాడు నబీల్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.