English | Telugu

దసరాకు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్ లో తారక్, మహేష్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో జెమిని టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో 'బిగ్ బాస్'తో ఆకట్టుకున్న తారక్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ షోపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జెమిని.. తారక్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి రికార్డ్ స్థాయిలో రేటింగ్ తెప్పించాలన్న ఉద్దేశంతో తారక్ సన్నిహితులైన టాలీవుడ్ బడా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతుంది.

తారక్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. తారక్, చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. దీంతో తారక్ షో కోసం చరణ్ ని రంగంలోకి దింపారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివలను రంగంలోకి దింపింది జెమిని. ఈ ఎపిసోడ్ సోమవారం టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.

ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్ కోసం 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో నిర్వాహకులు సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ ఎపిసోడ్ షూట్ కూడా చేశారని సమాచారం. తారక్-మహేష్ కలిస్తే ఎపిసోడ్ రేటింగ్ ఏ స్థాయిలో దూసుకుపోతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, బిగ్ బాస్ షో, సీరియల్స్ ని తట్టుకొని మంచి రేటింగ్ సాధించాలంటే ఈ మాత్రం సెలబ్రిటీస్ ని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.