English | Telugu

కూలీ పనిచేస్తూ కన్పించిన అనసూయ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -134 లో....కాంచన చైన్ చూపించి ఇది ఎవరిది అని అడుగుతుంది. నన్ను చిన్నప్పుడు ఒక అమ్మాయి కాపాడిందని తెలుసు కదా.. ఆ అమ్మాయి చైన్.. అనుకోకుండా నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడా ఉందో ఆమెకి సాయం చెయ్యాలి.. ఒకవేళ దీప లాంటి పరిస్థితిలో ఉందేమోనని కార్తీక్ అంటాడు. అందరూ అల ఎందుకు ఉంటారు. అందరు నర్సింహాలాగా ఉంటారా? మీ నాన్న లాంటి వాళ్ళు కూడా ఉంటారని కాంచన అంటుంది. నాన్న గురించి నీకు తెలిస్తే తట్టుకోలేవని కార్తీక్ అనుకుంటాడు. ఆ అమ్మాయి ఎదురుపడాలని కోరుకుంటున్నానని కాంచన అంటుంది.

మరొకవైపు దీప వెళ్తుంటే అనసూయ కూలి పని చేస్తూ కన్పిస్తుంది. తనని చూసి అత్తయ్య మీరు ఇక్కడ ఉన్నారేంటి? నాతో రండి అని అంటుంది. నేను రాలేను కోర్ట్ లో జరిగిన దానికి వాళ్ళు నన్ను బయటకు పంపిస్తారని తెలుసు.. అందుకే నేనే బయటకు వచ్చేసానని అనసూయ అంటుంది. నాతో పాటు ఉండండి అని దీప రిక్వెస్ట్ చేస్తుంది. దంతో అనసూయ నేను వస్తానులే నువ్వు వెళ్ళనని అంటుంది. మరొకవైపు కోర్ట్ చుట్టు తిరిగిన ఖర్చు అంత లెక్క రాసిపెడుతుంది శోభ. ఇవన్నీ ఇస్తేనే కార్ కీస్ ఇస్తానని నరసింహాతో అనగానే సరే ఊళ్ళో నా ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తానని నరసింహ అంటాడు. ఆ తర్వాత స్వప్నతో కాశీ గురించి మాట్లాడతాడు కార్తీక్. నువ్వు ఏదైనా జాబ్ చూసుకోమని చెప్తాడు. నువ్వు మీ లవ్ గురించి మీ డాడ్ తో చెప్పవా అని కార్తీక్ అడుగుతాడు.. లేదు మా డాడ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని డౌట్ గా ఉందని స్వప్న అంటుంది. ఆ తర్వాత నువ్వు బిజినెస్ చేస్తా అన్నావ్.. నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానని స్వప్నకి కార్తీక్ చెప్తాడు.

ఆ తర్వాత దీప దగ్గరికి అనసూయ వస్తుంది. అనసూయని చూసి తన వెంట నరసింహా వచ్చాడని శౌర్య భయపడుతుంది. అనసూయ రావడంతో దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే విషయం సుమిత్ర దగ్గరికి దీపవెళ్లి చెప్తుంది. నాతో పాటు ఇక్కడే ఉంటుందని దీప అడుగుతుంది. అందుకు సుమిత్ర ఒప్పుకొని‌.. వచ్చి దీపకి సపోర్ట్ చేసినందుకు థాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత శౌర్య టాబ్లెట్ అయిపోతే దీప తీసుకొని రావడానికి వెళ్తుంటే.. నేను వెళ్తానని అనసూయ అంటుంది. దీప డబ్బులు ఇస్తుంటే నా దగ్గర ఉన్నాయని అనసూయ వెళ్తుంది. దాంతో దీప తన దగ్గర అనసూయ డబ్బులు లాక్కున్న రోజులు గుర్తుచేసుకొని ఇప్పుడు బాధ్యతగా ఉన్నారు అత్తయ్య.. హ్యాపీగా ఉందని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.