English | Telugu

Karthika Deepam2 : సుమిత్ర నిర్ణయం విని జ్యోత్స్న షాక్.. వాళ్ళిద్దరిని కార్తీక్ ఒక్కటి చేస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-514 లో.. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని జ్యోత్స్న అంటుంది. అవసరం లేదు నువు కూడా ఆఫీస్ కి రా అని శ్రీధర్ అంటాడు. ఎందుకు మీకు అసిస్టెంట్ గానా అని జ్యోత్స్న అంటుంది. నేను మీకు అందరికి దూరంగా వెళ్ళిపోతానని జ్యోత్స్న అంటుంది. వెళ్ళిపోమని శివన్నారాయణ అంటాడు. నీ తొందరపాటు నిర్ణయం వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చిందని శివన్నారాయణ కోప్పడతాడు.

నాన్న దగ్గరికి వెళ్లి జ్యోత్స్న మానసిక స్థితి గురించి చెప్తూ సుమిత్ర బాధపడిందని దశరథ్ అంటాడు‌. అత్త నీ కూతురు సీఈఓగా ఉండాలి అంటే చెప్పు ఇప్పుడు తాతని ఒప్పిస్తానని కార్తీక్ అంటాడు. నాకు రెండు నిర్ణయాలు ఉండవు. నా కూతురికి పెళ్లి చేయాలి. నాతో ఉండాలి అంతే అని సుమిత్ర అంటుంది. విన్నావుగా అని జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు.

రేపు వస్తున్నావ్ కదా మేనకోడలా అని జ్యోత్స్నకి చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ శివన్నారాయణ మాట్లాడుకుంటారు. మీ నాన్నని సీఈఓ చేయడం.. మొత్తం నాదే నిర్ణయం ఎందుకో తెలుసా.. మీ అమ్మ ముందే అతన్ని కొట్టాను.. నా వల్ల వాళ్ళు విడిపోయారు.. మళ్ళీ ఒక్కటవ్వాలి.. అది నువ్వే చెయ్యలని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తాడు. నాన్న కి ఫోన్ చేసి విష్ చెయ్యొచ్చు కదా అన్నట్లుగా కాంచనతో కార్తీక్ అంటాడు. కాంచన టాపిక్ డైవర్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.